బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్‌గా వచ్చిన నాగ మణికంఠ.. తన ఫ్యామిలీ స్ట్రగుల్స్ చెప్పి అందరి కళ్లు చెమ్మగిల్లేట్టు చేశాడు తొలివారంలో. తన తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి రెండో పెళ్లి చేసుకుందని.. కొన్నాళ్లకు ఆమెకు కాన్సర్ వచ్చి తీవ్ర అనారోగ్యంతో చనిపోయిందని.. తన స్టెఫ్ ఫాదర్ వల్ల అవమానాలు పడ్డాడని.. తల్లి చనిపోయిన 11వ రోజునే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఎవరూ లేని ఒంటరిని అయ్యానని చెప్పాడు. ఇక తన తల్లి చనిపోతూ.. నీ కడుపున మళ్లీ పుడతాను అని చెప్పడంతో కొండంత ఆశతో ప్రియ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మణికంఠ. అయితే అతను అనుకున్నట్టుగానే కొన్నాళ్లకి కూతురు పుట్టింది. భార్య, కూతురితో పాటు యూఎస్‌లో ఉండే నాగ మణికంఠకి సరైన సంపాదన లేకపోవడంతో.. ఆర్థిక ఇబ్బందులతో పాటు అవమానాలు మొదలయ్యాయి.

 బిగ్ బాస్ సీజన్ 8 లాంఛింగ్ డే నాడు.. మణికంఠ స్పెషల్ వీడియోలో తన భార్య.. తనని ఇండియాకి వెళ్లిపొమ్మన్నదని భార్య, కూతురు ఉన్నా ఒంటరివాడినయ్యానని చెప్పి ఎమోషనల్ అయ్యాడు. అది ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయిపోతుంది. ఇదిలా ఉంటే హౌస్ లో ఉన్న ప్రతీ అమ్మాయిని సందర్భం ఉన్నా లేకపోయినా కౌగలించుకుంటాడు. ముఖ్యంగా ఈ వారం మొత్తం లో ఈయన లేడీ కంటెస్టెంట్స్ తో ప్రవర్తించిన తీరు చూసే ఆడియన్స్ కి ఇతనికి అమ్మాయిల పిచ్చి ఉన్నట్టుంది అని అనిపించేలా చేసింది. ఇందులో భాగంగానే తాజాగా నాగమణికంఠ హగ్గులపై నాగ్  చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తాడు. అతనిని నిన్ని కన్ఫెషన్ రూమ్ లోకి ప్రత్యేకంగా పిలిచి, యష్మీ ని మూడు సార్లు హత్తుకున్న వీడియో ని చూపిస్తాడు. ఆ తర్వాత యష్మీ ఇబ్బంది పడుతూ ‘ప్లీజ్ బిగ్

 బాస్..అతన్ని ఆపండి, నా వల్ల కావడం లేదు’ అని అంటూ ఏడ్చే వీడియో ని కూడా చూపించాడు. ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ ‘యష్మీ ఎంత ఇబ్బంది పడిందో చూడు..కేవలం యష్మీ మాత్రమే కాదు, చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఆ వీడియోస్ ఇప్పుడు నేను చూపించడం లేదు. ఇలాగే నీ తీరు కొనసాగితే నువ్వు బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్ళిపోతావ్’ అని అంటాడు. అప్పుడు మణికంఠ ‘దయచేసి నన్ను క్షమించండి సార్..ఒక్కేసారి నాకు అంత మంది స్నేహితులు పరిచయం అయ్యేలోపు నేను నా హద్దులను మర్చిపోయాను’ అని అంటాడు. ఈ ఎపిసోడ్ తర్వాత అయినా మణికంఠ మారుతాడో లేదో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: