‘బలగం’ మూవీతో దర్శకుడిగా తన తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అందుకున్నారు నటుడు వేణు.  ఇంటి పెద్ద కన్నుమూత నేపథ్యంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలే ఇతివృత్తంగా రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. దాదాపు 25 ఏళ్ళ క్రితమే సినీ పరిశ్రమలోకి వచ్చిన అతను మొదట కొన్నాళ్ళ పాటు అసిస్టెంట్గా పనిచేసి, ఆ తర్వాత చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ కెరీర్లో ఉన్నత స్థానానికి ఎదిగారు. మున్నా సినిమాతో కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఆ తర్వాత జబర్దస్త్ షోతో జనాలకు మరింత చేరువ అయ్యారు. ఇప్పుడు దర్శకుడిగా మారి సినిమాలు చేయడం

 ప్రారంభించారు. ప్రస్తుతం తన రెండో సినిమా కోసం పని చేస్తున్నారు. రెండవ సినిమా కోసం చాలా కాలం కిందటే ఓ కథ రెడీ చేసుకున్నాడు వేణు. ఆ కథను పలువురు హీరోలకు వినిపించాడు కూడా కానీ ఎందుకనో ఎక్కడ ఫైనల్ అవ్వలేదు. ఆ మధ్య నేచురల్ స్టార్ నాని దగ్గర దాదాపు ఓకే అయినట్టే అని వినిపించింది, కానీ సెకండ్ హాఫ్ పట్ల నానిమరొక వెర్షన్ అడిగాడని మార్చిన కూడా అక్కడ ఒకే అవ్వలేదు. అటు తిరిగి ఇటు తిరిగి మరొక యంగ్ హీరో నితిన్ దగ్గరకు వచ్చిందని టాక్. కథ నితిన్ వినాల్సి ఉందని సమాచారం. స్టోరీ చెప్పాలి మల్లి మార్పులు చేర్పులు ఉంటే చేయాల్సి ఉంటుంది. కానీ వేణు మార్పులు లేకుండా తాను

 రాసుకున్న కథను తెరకెక్కించాలని గట్టిగా ఉన్నాడు. చూడాలి మరి ఎం జరుగుతుందో. ఇంకా గ్రీన్ సిగ్నల్ రాని ఈ కథకు నిర్మాత దిల్ రాజు యల్లమ్మ అనే టైటిల్ ను రిజిస్టర్ చేసి ఉంచారు. నితిన్ ప్రస్తుతం రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలలో నటిస్తున్నాడు. మరి మొదటి సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న బలగం వేణు తన రెండవ సినిమా కోసం. ఏ విధంగా ప్లాన్ చేస్తాడో ఎలా సక్సెస్ అవుతాడు అన్నది చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: