యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానుల దేవర సినిమా రెండవ ట్రైలర్ కోసం చాలా ఆతృతగా ఎదురు చూశారు. ఆ ట్రైలర్ కూడా గడిచిన కొన్ని నిమిషాల క్రితం రానే వచ్చేసింది. సెప్టెంబర్ 27న పాన్ ఇండియా వైస్ గా ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు. కొరటాల శివ కాంబినేషన్ కాబట్టి ఈ సినిమా హైప్ పెరిగింది. మొదటిసారి జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ వంటివారు ఈ చిత్రంలో నటిస్తూ ఉన్నారు. మరి రెండవ ట్రైలర్ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో లేదా చూద్దాం.



ట్రైలర్లలో భారీ హైప్ గా జూనియర్ ఎన్టీఆర్ ని చూపించారు.. అలాగే సైఫ్ అలీఖాన్ నీ కూడా ప్రత్యర్థి పాత్రలో చూపించారు. సముద్రంలోని సన్నివేశాలు కూడా హైలెట్ గా నిలుస్తున్నాయి. బ్యాక్గ్రౌండ్ ప్రకాష్ రాజు వాయిస్ కూడా ట్రైలర్లు హైలెట్ గానే ఉన్నది. అలాగే బిజీఏంతో పాటు సముద్రంలోని ఫైట్స్ సన్నివేషాలు కూడా అబ్బురు పరిచయాలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డైలాగులు కూడా అభిమానులను బాగానే ఆకట్టుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కూడా ఇందులో మాస్ అవతారంలో కనిపించడమే కాకుండా జాన్వీ కూడా చాలా గ్లామర్ హీరోయిన్గా కనిపించడమే కాకుండా పల్లెటూరి అమ్మాయిగా యాసతో అదరగొట్టేస్తోంది. ఎన్టీఆర్ షార్ప్ తో ఫైట్ కూడా  ఆకట్టుకునేలా కనిపిస్తోంది. అలాగే ఎన్టీఆర్ ఇందులో  మాస్ స్టెప్పులతో ద్విపాత్రాభినయంలో కూడా అద్భుతంగా ఆకట్టుకుంటున్నారు. చివరిలో తండ్రి కొడుకులుగా ఎంట్రీ అవ్వడం కూడా బాగానే ఆకట్టుకుంటోంది.


మైనస్ విషయాలకి వస్తే:
దేవర సినిమా పాన్ ఇండియా చిత్రమైనప్పుడు భారీగా బజ్ వుండాలి కానీ ఆ రేంజ్ ఎక్కడా కూడా  కనిపించలేదట.. ట్రైలర్లు కూడ హంగామా సృష్టించలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ట్రైలర్ మొత్తం చూసిన కూడా ఎక్కువగా సముద్రం బ్యాక్ డ్రాప్ తప్ప.. మిగతాదంతా కూడా కాస్త రొటీన్ గానే కనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నేటిజన్స్. అయితే ఇందులో థ్రిల్ అయ్యే  సన్నివేశాలు ఏమి ట్రైలర్లో కనిపించడం లేదని.. గతంలో ఆచార్య డిజాస్టర్ మూవీ ఈ సినిమాకి వెంటాడుతోందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఓవరాల్ గా ట్రైలర్ అయితే అభిమానులను బాగానే ఆకట్టుకున్న బజ్ పెంచలేకపోతోందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి సినిమా ఎలా ఉందో తెలియాలి అంటే సెప్టెంబర్ 27 వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: