దివంగత నటుడు హరికృష్ణ గురించి చాలామందికి తెలియని విషయం ఇది. ఆయన ఓ విషయంలో మండిపడి ఫిలిం ఛాంబర్ ముందు అర్థనగ్నంగా నిల్చొని ధర్నా చేశారట. మరి ఇంతకీ హరికృష్ణకి ఎందుకు అంత కోపం వచ్చింది..అర్ధ నగ్న ధర్నా ఎందుకు చేశారు అనేది ఇప్పుడు చూద్దాం.. హరికృష్ణ లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, టైగర్ హరిశ్చంద్రప్రసాద్,స్వామి వంటి సినిమాలతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించారు. అయితే అలాంటి హరికృష్ణకి ఓ సినిమా సమయంలో రెమ్యూనరేషన్ విషయంలో గొడవ జరిగింది. అదేంటంటే హరికృష్ణ మీనా కాంబినేషన్లో వచ్చిన స్వామి మూవీ అందరికీ తెలిసే ఉంటుంది.చెల్లెళ్లకి జరిగిన అన్యాయానికి అన్నగా హరికృష్ణ ఏం చేశారు అనేది ఈ సినిమాలో చూపించారు.అయితే ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలై ఫ్లాప్ అయింది. ఇక స్వామి సినిమా కి అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ అవ్వడంతో దీనికి నిర్మాతగా చేసిన సి.కళ్యాణ్ తన భూమి అమ్మి మరీ సినిమాని రిలీజ్ చేశారట. 

కానీ సినిమా అనుకున్న హిట్ అవ్వలేదు.పెద్ద డిజాస్టర్ అవడంతో పెట్టిన పెట్టుబడిరాక అప్పుల పాలయ్యారట.ఇక అదే సమయంలో హరికృష్ణ 15 లక్షల విషయాన్ని బయటకు తీసుకువచ్చారు. అయితే ఈ సినిమాకి హరికృష్ణ కి నిర్మాత 50 లక్షలు ఇస్తానని చెప్పారట. కానీ హరికృష్ణ మాత్రం నాకు 65 లక్షలు ఇస్తానన్నారని మిగిలిన 15 లక్షలు ఇవ్వాలి అని గొడవ చేశారట. దాంతో నిర్మాత సి.కళ్యాణ్ అసలు నేను ఈ సినిమాకి నిర్మాతగా చేయాలి అనుకోలేదు. కానీ ఆర్కే భగవాన్ వల్ల నేను ఈ సినిమాకి చేశాను. దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. 

ఏదైనా ఆర్కే భగవాన్ ని అడుక్కోండి అని చెప్పడంతో కోపంతో చిర్రెత్తుకుపోయిన హరికృష్ణ ఫిలిం ఛాంబర్ ముందు చొక్కా తీసేసి అర్ధ నగ్నంగా ధర్నా చేశారట. దాంతో ఆర్కే భగవాన్ హుటాహుటిన అక్కడికి వచ్చి పెద్దాయన మీకు రావాల్సిన డబ్బులు నేను ఇస్తాను. పూర్తి బాధ్యత నాదే అని చెప్పారట. అలా ఫిలిం ఇండస్ట్రీలోని పెద్దలందరూ పంచాయతీ పెట్టుకొని ప్రస్తుతం నా దగ్గర డబ్బు లేవు ఎలాగైనా మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను అని ఆర్ కే భగవాన్ చెప్పడంతో హరికృష్ణ శాంతించారట.. అలా వందల కోట్ల ఆస్తి ఉన్న హరికృష్ణ 15 లక్షల రెమ్యూనరేషన్ కోసం ఫీలింగ్ ఛాంబర్ ముందు రచ్చరచ్చ చేశారంటూ అప్పట్లో ఇండస్ట్రీ జనాలు మాట్లాడుకున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: