మ్యాన్ ఆఫ్ మాస్సెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఐదు సంవత్సరాలకు పైగా గ్యాప్ తీసుకుని మరి దేవర సినిమాతో ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అదేవిధంగా ఈ రాత్రి హైదరాబాదులో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఎంతో గ్రాండ్గా జరగబోతుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. అయితే తాజాగా ఈ సినిమాను కొందరు టాలీవుడ్కు చెందిన అగ్ర దర్శకులు స్పెషల్ షో చూశారు. ఇక దీంతో ఇప్పుడు వాళ్ళ మాటలు ద్వారా ఈ సినిమా ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చింది.


ఇక ఈ సినిమా ఈ నెల 27న తెలివితో పాటు పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచే మిడ్ నైట్ షోలు పడనున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాను దర్శక దీరుడు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్,  పలువురు అగ్ర నిర్మాతలు ఈ సినిమా ఫైనల్ కాపీని హైదరాబాదులో వీక్షించారు. సినిమా ఎలా ఉందో తమ అభిప్రాయాన్ని వారు అభిమానులతో పంచుకున్నారు. వారి దగ్గర్నుంచి వచ్చిన ఫస్ట్ రివ్యూ ఎలా ఉందో చూద్దాం.


దేవర మూవీ ఎన్టీఆర్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ.. ఫస్ట్ ఆఫ్  కంటే సెకండ్ హాఫ్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తుంది. ఈ సినిమా క్లైమాక్స్ అయితే ప్రేక్షకుల మతులు పోగొడుతుంది. అంటూ తమ అభిప్రాయాన్ని వారి స్నేహితులతో పంచుకున్నారు. ఇక దీంతో ట్రేడ్ వర్గాలతో పాటు అభిమానుల్లో కూడా సంతోషం  వ్యతం అవుతుంది. ఇప్పుడు వారి రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మూవీపై అంచనాలు తారాస్థాయికి చేరాయి.


దర్శకుడు కొరటాల ఆచార్య లాంటి భారీ డిజాస్టర్ తర్వాత ఎంతో కాసిగా దేవరను తెరకెక్కించాడు. ఈ సినిమా భారీ విజయం సాధిస్తే ఎస్.ఎస్.రాజమౌళి ప్రశాంత్ ని లోకేష్ కనకరాజ్ వంటి పాన్ ఇండియా దర్శకుల సరసన కొరటాలా చేరిపోవడం పక్కా. పాన్ ఇండియా సినిమాగా దేవర మూవీ రాబోతుంది. ఇక దేవరలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేయగా… అందులో కొడుకు క్యారెక్టర్ సరసన జాన్వీ కపూర్ కథానాయిక గా నటించారు. విలన్ తరహా కీలక పాత్ర లో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు.. వీరితో పాటుగా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. అనిరుద్ సంగీతం అందించారు.
[3:04 pm, 22/9/2024] V Subhash:

మరింత సమాచారం తెలుసుకోండి: