రీసెంట్ గా కురిసిన వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు వరదల్లో మునిగిపోయాయి. అలా విజయవాడ తో పాటు లంక గ్రామాలు ఏపీలో వరద బారిన పడితే తెలంగాణలో ఖమ్మం, వరంగల్ లు వరదల్లో మునిగిపోయింది. ఇక వరదల సమయంలో చాలామంది సెలబ్రిటీలు రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళాలు అందించారు. అలా మహేష్ బాబు కూడా ఏపీ, తెలంగాణకు చేరో 50 లక్షల విరాళం అందించారు. అయితే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు మహేష్ బాబు. ఇక మహేష్ బాబు తో పాటు నమ్రత కూడా రేవంత్ రెడ్డి ని కలిసి చెక్ అందించారు. అంతేకాకుండా ఏఎంబి సినిమాస్ తరఫున మరో 10 లక్షలు ఎక్స్ట్రాగా ఇచ్చారు. ఇక ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే మహేష్ బాబు రేవంత్ రెడ్డిని కలిసి విరాళం అందించారనే దానికంటే ఎక్కువగా మహేష్ బాబు లుక్ గురించే చాలామంది డిస్కషన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు లుక్ గురించి ఎన్నో వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

ఇక ఇప్పటివరకు మహేష్ బాబు కనిపించనంత డిఫరెంట్ లుక్ లో రాజమౌళి సినిమా కోసం సన్నద్ధమవుతున్నారు. అయితే చాలామంది మహేష్ బాబు అభిమానులు ఒక విషయంలో ఎప్పుడు నిరాశ పడుతూ ఉంటారు. అదేంటంటే మహేష్ బాబుని ఇప్పటివరకు  పూర్తి స్తాయి మాస్ లుక్ లో చూడలేదే అని. కానీ రాజమౌళి సినిమాతో అభిమానుల కోరిక మహేష్ బాబు తీర్చబోతున్నట్టు తెలుస్తోంది.తాజాగా రేవంత్ రెడ్డిని కలిసిన సమయంలో మహేష్ బాబు గుబురు గడ్డంతో,జులపాల జుట్టుతో తో మాస్ ఆడియన్స్ ని మెప్పిస్తున్నారు. ఇక మహేష్ బాబు ని చూస్తుంటే అర్జున్ రెడ్డి, పుష్ప వంటి పాత్రలు గుర్తుకు వస్తున్నాయి. ఇక ఈ రెండు సినిమాల్లో హీరోలు మాస్ పాత్రల్లోనే కనిపించారు.

అయితే మహేష్ లుక్ చూస్తే రాజమౌళి దర్శకత్వంలో రాబోయే సినిమా ఏ రేంజ్ మాస్ జానర్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.ఇక రాజమౌళి మహేష్ బాబుతో పాన్ వరల్డ్ లెవెల్లో సినిమా చేస్తానని అనౌన్స్ చేసి నాలుగు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు.ప్రస్తుతం ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి ఒక బిగ్ అనౌన్స్మెంట్ ఉండబోతున్నట్టు సమాచారం. అలాగే రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు ఇప్పటికే ఎన్నో కసరత్తులు చేస్తున్నారు. ఇక సినిమా కంటే ముందే మహేష్ బాబు లుక్స్ పై కొత్త డిస్కషన్లు మొదలయ్యాయి. ప్రస్తుతం మహేష్ బాబుకి సంబంధించిన ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ గా మారాయి

మరింత సమాచారం తెలుసుకోండి: