టాలీవుడ్ టాల్ హ్యాండ్సం హీరో గోపీచంద్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన యాక్షన్ సినిమాలతో గోపీచంద్ తెలుగు మాస్ ఆడియన్స్ కి చాలా దగ్గరయ్యాడు. ఆయన యజ్ఞం, లక్ష్యం, శౌర్యం, సాహసం అనే సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఇక ఆ తరువాత చేసిన సినిమాలు పెద్దగా ఆడకపోయినా, గోపీచంద్ కు ప్రేక్షకుల్లో ఓ రకమైన ఫాలోయింగ్ ఉంది. అందుకే అతని సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే దాదాపు ఒక దశాబ్దం నుండి ఆయన సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో ప్రస్తుతం వచ్చే సినిమా పైనే ఈ హీరో ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. మరో విషయం ఏమిటంటే... సినిమా టైటిల్స్ చివరలో 'o' వచ్చేలా చూసుకున్న ప్రస్తుత సినిమా "విశ్వం"పై చాలా ఆశలు పెట్టుకున్నట్టు తెలుసోతోంది.

కాగా ఈ సినిమాకి గాను గోపీచంద్ ఎక్కువ మొత్తంలో తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.  ఈ సినిమాకి సదరు నిర్మాతలు దాదాపు 7 కోట్లరూపాయిలు గోపీచంద్ కి ముట్టజెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని విశ్లేషణలు బయటకి వస్తున్నాయి. ఇంతవరకు.. అంటే ఓ దశాబ్ద కాలానికి పైగా ఆయన సినిమాలు ఆడిన దాఖలాలు లేవు. ఎప్పుడు రిలీజై ఎప్పుడు పోతున్నాయో కూడా తెలియని పరిస్థితి. ఇక కలెక్షన్ల గురించి అయితే మాట్లాడవలసిన పనిలేదు.. ఇలాంటి తరుణంలో ఆయనకే  7 కోట్లరూపాయిలు సదరు నిర్మాతలు ఖర్చు చేస్తే, ఇక సినిమా మొత్తం మీద ఎంత ఖర్చు అయిందో ఊహించుకోవచ్చు. పైగా ఆడిన సినిమాల కలెక్షన్లు కూడా మనం ఊహించుకోవచ్చు!

ఇలాంటి తరుణంలో హీరో గోపీచంద్ పై అంత పెట్టి నిర్మాతలు ఎందుకు ఖర్చు చేస్తున్నారు అనేది చాలామందిని వేధిస్తున్న ప్రశ్న. అయితే ఓ మోస్తరు సినిమాకి ఎంత ఖర్చు చేసినా అది బడ్జెట్ లోపునే ఉంటుందని వినికిడి. ఇపుడు OTT రైట్స్ కూడా అదనంగా రావడంతో ఈ హీరోతో ఎవరు సినిమా చేసినా సేఫ్ జోన్ ఉంటుందని మాటలు వినబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: