దేవర సినిమా వైబ్స్ ప్రస్తుతం ఇండియా అంతటా నడుస్తున్నాయి. దానికి కారణం జూనియర్ ఎన్టీఆర్ అని వేరే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. rrr సినిమా తరువాత ఎన్టీఆర్ చేసిన పాన్ ఇండియా సినిమా కావడం చేత ఈ సినిమా పైనే ఎన్టీఆర్ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ కోసం ఎంతగానో ఎదురు చూసిన అభిమానులకు చుక్కెదురు అయింది. అశేష జనం నిన్న జరిగిన నోవాటిల్ దగ్గరికి తరలి వెళ్లడంతో ఈవెంట్ రద్దు చేసారు. దాంతో అభిమానులు చాలా నిరాశకు గురయ్యారు. ఈ తరుణంలో ఎన్టీఆర్ ఓ వీడియో ద్వారా అభిమానులను పలకరించిన సంగతి విదితమే.

ఇక ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు దివంగత నటి శ్రీదేవి వారసురాలు నటి జాన్వీ కపూర్ వస్తోన్న సంగతి కూడా అందరికీ తెలిసినదే. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో క్యాన్సిల్ అయిన ప్రీ రిలీజ్ వేడుక విషయంలో నటి జాన్వీ కపూర్ సైతం సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోని విడుదల చేసి, తన ఆవేదనని వ్యక్తం చేశారు. అయితే ఈమె విడుదల చేస్తున్న వీడియోలో అచ్చమైన తెలుగు భాషలో మాట్లాడటంతో ఈ వీడియో కాస్త వైరల్ అవుతుందిపుడు. ఇందులో భాగంగా జాన్వీ మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. నన్ను ఇంతలా ఆదరిస్తూ నాపై ఎంతో ప్రేమను చూపిస్తున్న తెలుగు ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ ఫాన్స్ నన్ను జాను పాప! అని పిలవడం నాకు చాలా నచ్చింది. నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీ అందరూ గర్వపడే రోజు కోసం నేడు ఎదురు చూస్తున్నాను. ఫంక్షన్ క్యాన్సిల్ అయిందని బాధపడొద్దు.. ఐ లవ్ యు!" అని వీడియో పోస్ట్ చేసింది.

ఇక సదరు వీడియోని చూసిన ఎన్టీఆర్ అభిమానులు ఖుషీ అయిపోతున్నారు. ఇంకా ఆమె వీడియోలో మాట్లాడూతూ... ఈ సినిమాలో హీరోయిన్ గా నన్ను ఎంపిక చేసినందుకు కొరటాల శివ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు! అంటూ చెప్పుకొచ్చింది. దాంతో సదరు వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవువుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: