ఉప్పెన’ సూపర్ సక్సస్ తరువాత కృతి శెట్టి టాప్ హీరోయిన్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలతో పాటు మీడియా వర్గాలు కూడ భావించాయి. అయితే జరిగింది వేరు. ఆమెకు అనేక అవకాశాలు వచ్చాయి కానీ విడుదలైన ప్రతి సినిమా ఫైయిల్యూర్ కావడంతో ఆమె పై ఐరన్ లెగ్ బ్యూటీ ముద్ర పడింది. టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో మీడియం రేంజ్ హీరోలు నాని రామ్ నితిన్ నాగచైతన్యలతో ఆమె నటించిన సినిమాలు అన్నీ ఫెయిల్ అవ్వడంతో ప్రస్తుతం ఆమెకు అవకాశాలు రావడంలేదు.



తమిళ ఫిలిమ్ ఇండస్ట్రీలో కూడ ఈమెకు ఏమాత్రం చెప్పుకోతగ్గ అవకాశాలు రాలేదు. దీనితో ఈమె కెరియర్ ముగిసిపోయింది అంటూ అంచనాలు వచ్చాయి. అయితే ఎవరు ఊహించని విధంగా ఆమెకు మళయాళ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఊహించని బ్రేక్ దొరికింది. మళయాళ ఫిలిమ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మంచి రైజింగ్ లో ఉన్న టొవినో థామస్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘ఏఆర్ఎం’ లో ఆమెకు హీరోయిన్ ఛాన్స్ లభించడంతో చాలామంది షాక్ అయ్యారు.



భారీ బడ్జెట్ తో తీసిన ఈ మూవీ మళయాళ ప్రేక్షకులకు బాగా నచ్చడంతో ఈ మూవీకి రికార్డు కలక్షన్స్ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ సినిమాను బాలీవుడ్ ప్రేక్షకులు కానీ కాలీవుడ్ ప్రేక్షకులు కానీ పట్టించుకోలేదు. అయితే మాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం ఈ మూవీకి అఖండ విజయం అందించడమే కాకుండా ఈ మూవీలో కీలక పాత్రలో నటించిన కృతి పై మళయాళ మీడియా ప్రశంసలు కురిపిస్తోంది.



దీనితో ఈమెకు మళయాళ ఫిలిమ్ ఇండస్ట్రీ నుండి వరసపెట్టి అవకాశాలు వచ్చే ఆస్కారం కనిపిస్తోంది. ‘ఉప్పెన’ తరువాత కృతి తెలుగులో తనకు వచ్చిన ప్రతి సినిమాను ఒప్పుకుని తప్పు చేసింది అన్న కామెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కృతి మళయాళ ఫిలిమ్ ఇండస్ట్రీ లో అటువంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తే తిరిగి సరైన ట్రాక్ లోకి కృతి వచ్చే ఆస్కారం ఉంది..  





మరింత సమాచారం తెలుసుకోండి: