ప్రస్తుతం ఎక్కడ చూసినా దేవర హవానే నడుస్తోంది.. ఇక దేవరకి పోటీగా పెద్ద హీరోల సినిమాలు ఏమీ లేకపోవడంతో దేవరకి లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దసరాకి ఒక మంచి సినిమా చూడచ్చు అనే ఫీలింగ్ తో చాలామంది అభిమానులు ఉన్నారు. అయితే అలాంటి దేవర గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇక రీసెంట్గా దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్  క్యాన్సల్ అవ్వడంతో చాలామంది అభిమానులు నిరాశ పడ్డారు. కానీ ఈ విషయంలో చిత్ర యూనిట్ స్పందించి స్వయంగా క్షమాపణలు కోరారు. ఇక సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దేవర కి సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి. అయితే తాజాగా  దేవర మూవీ గురించి ఒక రూమర్ వినిపిస్తోంది. అయితే ఇది రూమరో లేక నిజమేనేమో తెలియదు. కానీ ప్రస్తుతం ఈ వార్త విన్న చాలా మంది ఆ హీరోయిన్ అభిమానులు ఫీల్ అవుతున్నారు.అదేంటంటే దేవర మూవీలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది.

అయితే ఈ హీరోయిన్ కంటే ముందే 2023లో దేవర సినిమాని అనుకున్న సమయంలో మరో హీరోయిన్ పేరు తెర మీద వినిపించింది. అంతే కాదు ఆ హీరోయిన్ ఎన్టీఆర్ సరసన ఫిక్స్ అయింది అంటూ కూడా వార్తలు వినిపించాయి. ఇక ఆ బ్యూటీ ఎవరో కాదు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. కొరటాల శివతో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నారు అనే  అఫీషియల్ న్యూస్ బయటపడడంతోనే ఈ మూవీలో హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది అనే రూమర్స్ చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్త వినగానే రష్మిక మందన్నా ఎన్టీఆర్ కాంబోలో సినిమా రెడీ అంటూ చాలామంది అభిమానులు ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యారు. కానీ వీరు కాంబోలో సినిమా మిస్సయిపోయింది.

అయితే ఈ సినిమాల్లో రష్మిక కి అవకాశం వచ్చిన సమయంలో చిరంజీవితో కొరటాల శివ చేసిన ఆచార్య ఎన్నో అంచనాల మధ్య వచ్చి  ఫ్లాప్ అయింది.కాబట్టి నెక్స్ట్ సినిమాపై ఆ మూవీ రిజల్ట్ పడుతుంది.ఇలాంటి టైంలో ఈ సినిమాను ఒప్పుకోకపోవడమే బెటర్ అనే ఓ సిల్లీ రీజన్ తో రష్మిక మందన్నా ఈ సినిమాలో అవకాశం వదులుకున్నట్టు ఆ మధ్యకాలంలో టాక్ వినిపించింది.అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ రష్మిక పేరు వినిపించడం ఆగిపోయి జాన్వీ కపూర్ పేరు నెట్టింట వైరల్ అయింది. ఇక అందరూ అనుకున్నట్టే ఎన్టీఆర్ తో తెలుగు చిత్ర సీమ పరిశ్రమలోకి జాన్వీ కపూర్ ఎంట్రీ ఇచ్చింది. తల్లి బాటలోనే  సౌత్ లో కూడా రాణించాలి అనుకున్న జాన్వి కపూర్ కి ఈ సినిమా పెద్ద ప్లస్ అవ్వాలి అని చాలామంది  అభిమానులు భావిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: