తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి నితిన్ కొన్ని సంవత్సరాల క్రితం సై అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో జెనీలియా హీరోయిన్ గా నటించగా , టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి ఎస్ ఎస్ రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. దర్శకుడు రాజమౌళి తండ్రి అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథను అందించగా , ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ 2004 వ సంవత్సరం సెప్టెంబర్ 23 వ తేదీన థియేటర్లలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

సినిమా విడుదల అయ్యి నిన్నటితో 20 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సినిమా విడుదల అయ్యి తాజాగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మూవీ కి ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కి ఎలాంటి రికార్డ్స్ ఉన్నాయి అనే వివరాలను తెలుసుకుందాం. ఈ మూవీ ని ఆ సమయంలో 5 కోట్ల బడ్జెట్ తో రూపొందించగా ఈ మూవీ కి మొత్తం 11 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చాయి. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక ఈ మూవీ ఒక సెంటర్లో 365 రోజుల పాటు ఆడింది. ఈ మూవీ తో నితిన్ కు సూపర్ సాలిడ్ క్రేజ్ వచ్చింది. అలాగే రాజమౌళి కి కూడా ఈ మూవీ తో దర్శకుడిగా మరింత క్రేజ్ పెరిగింది. ఇక ఈ మూవీ విజయంలో ఎం ఎం కీరవాణి అందించిన సంగీతం కూడా అత్యంత కీలక పాత్రను పోషించింది. ఈ మూవీ లోని నటనకు గాను నితిన్ , జెనీలియా కు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: