జూనియర్ ఎన్టీఆర్ హీరో గా రూపొందిన దేవర సినిమాను సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు . ఈ సినిమా లో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటించింది . ఈ మూవీ తోనే ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది . సైఫ్ అలీ ఖాన్మూవీ లో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు . కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా , అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యంలో చాలా రోజుల నుండి ఈ మూవీ బృందం వారు దేశ వ్యాప్తంగా ప్రచారాలను నిర్వహిస్తూ వచ్చింది.

ఇక తెలుగులో పెద్దగా ప్రచారాలను చేయలేదు. దానితో తెలుగులో ఓ భారీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలి అని మూవీ మేకర్స్ మొదటి నుండి ప్లాన్ చేసుకున్నారు. అందులో భాగంగా సెప్టెంబర్ 22 వ తేదీన భారీ ఎత్తున నోవేటెల్ హోటల్లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను ఏర్పాటు చేసింది. కానీ హోటల్ కెపాసిటీ కి మంచి జనాలు అక్కడికి రావడంతో ఏమీ చేయలేని పరిస్థితులలో ఈవెంట్ ను క్యాన్సల్ చేశారు. ఈ సినిమా విడుదలకు ముందు మరో ఈవెంట్ ఉండే అవకాశం లేదు. ఎందుకు అంటే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే అమెరికాకు వెళ్ళిపోయాడు.

జాన్వి కపూర్ కూడా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయినందుకు బాధపడుతున్నట్లు ఓ వీడియోను విడుదల చేసింది. దానితో ఈమె వచ్చే అవకాశాలు కూడా దాదాపుగా లేవు అని చెప్పాలి. దానితో కొరటాల శివ రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. మరో ఒకటి , రెండు రోజుల్లో కొరటాల మీడియా ముందుకు వచ్చి అనేక విషయాలను చెప్పబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: