సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటివరకు తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. మహేష్ బాబు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు నిర్మాతగా రూపొందిన సినిమాలలో కూడా హీరోగా నటించాడు. దిల్ రాజు నిర్మించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బాబు హీరోగా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమా భారీ కలెక్షన్లను వాసులు చేసింది. ఈ మూవీ తర్వాత వీరి కాంబోలో మహర్షి అనే మూవీ వచ్చింది.

సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత మరో మూవీ కూడా వీరి కాంబో లో రాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ వీరి కాంబోలో మహర్షి మూవీ తర్వాత ఇప్పటివరకు వేరే సినిమా రాలేదు. కొంత కాలం క్రితం ఒక ఇంటర్వ్యూలో భాగంగా దిల్ రాజు , మహేష్ బాబు సినిమా వల్ల భారీ ఎత్తున నష్టం వచ్చినట్లు చెప్పకచ్చాడు.

అసలు విషయం లోకి వెళితే ... దిల్ రాజు మాట్లాడుతూ ... నేను సినిమా పరిశ్రమలో ఇంత కాలం పాటు కొరియర్ను కొనసాగించడానికి ప్రధాన కారణం డిస్ట్రిబ్యూటర్ గా , నిర్మాతగా కొనసాగుతున్నాను కాబట్టి. ఏదైనా ఒక పని చేసి ఉంటే ఇప్పటికే నా కెరీర్ క్లోజ్ అయ్యేది. 2017 వ సంవత్సరం నేను నిర్మించిన సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. అదే సంవత్సరం నేను మహేష్ బాబు హీరోగా ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన స్పైడర్ మూవీ ని డిస్ట్రిబ్యూట్ చేశాను. ఆ మూవీ వల్ల 12 కోట్లు పోయింది. నేను కేవలం డిస్ట్రిబ్యూటర్ అయి ఉంటే ఆ సినిమాతో పెద్ద మొత్తంలో నష్టాలు ఎదుర్కొనే వాడిని అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: