తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో గా కొనసాగుతున్న బిగ్ బాస్ కార్యక్రమానికి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే 7 సీసన్లను ఎంతో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న బిగ్బాస్ ఇప్పుడు 8వ సీజన్ ప్రసారమవుతుంది. ప్రేక్షకులను అలరిస్తుంది. ఎప్పటిలాగానే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ నామినేట్ చేయడం ఒకరితో ఒకరు దారుణంగా మాటలు యుద్ధానికి దిగడం చేస్తూ ఉన్నారు.


 అయితే బిగ్ బాస్ హౌస్ లో ప్రతి సోమవారం నామినేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇంట్లో ఉండడానికి అర్హత లేని వాళ్లను ఎవరు చెప్పాలి అంటూ బిగ్ బాస్ నామినేషన్స్ నిర్వహించగా.. ఇక ఈ నామినేషన్స్ ప్రక్రియ వాడి వేడిగానే జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ పూర్తయ్యాయి. దీంతోఈవారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే విషయంపై ఎంతో ఉత్కంఠ నెలకొంది అని చెప్పాలి.


 ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఇక ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ అప్పుడే ఫిక్స్ అయిపోయాడు అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది. హౌస్ లో ఉన్న అందరూ కూడా ఇప్పటికే నాగమణికంఠను టార్గెట్ చేశారు. కానీ అతను మాత్రం రోజు రోజుకు స్ట్రాంగెస్ట్ ప్లేయర్గా మారిపోతూ అభిమానుల ఓట్లను సంపాదించుకోగలుగుతున్నాడు. అయితే ఈసారి డేంజర్ జోన్ లో పృద్వి, ఆదిత్య ఓం ఉన్నారు అన్నది తెలుస్తుంది. అయితే సోనియా ఆటను కూడా తానే ఆడేస్తూ తన ఆటను తాను ఆడటం మర్చిపోతున్న పృథ్వినే.. ఇక ఈసారి హౌస్ నుంచి బయటికి వెళ్లే అవకాశం ఉంది అని అందరూ చర్చించుకుంటున్నారు. పృద్వికి బయట పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా లేదని అందుకే అతను ఈసారి హౌస్ నుంచి బయటికి వెళ్తాడని అంచనా వేస్తున్నారు. ఏం జరగబోతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: