రాంచరణ్, కియారా అడ్వాణీ హీరోహీరోయిన్లుగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గేమ్ చేంజర్. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 20 విడుదల కానున్న ఈ సినిమా నుంచి పెద్దగా అప్డేట్స్ రావడం లేదు. ఇటీవల ఒక సాంగ్, ఓ పోస్టర్ మినహా మీడియాలో అప్డేట్స్ ఏమీ కనిపించలేదని బెంగతో ఉన్న చెర్రీ ఫ్యాన్స్ కు‘గేమ్ ఛేంజర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ అక్టోబర్ 1 నుంచి స్టార్ట్ కానుంది. ఈ మూవీ సినిమా డిసెంబర్ 20న ఆడియెన్స్ ముందుకు రానుంది. అంటే ఇక నుంచి రచ్చ రచ్చే .. వచ్చే వారం నుంచి డిసెంబర్ 20 వరకు గేమ్ చేంజర్ బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్.. వరుస అప్డేట్స్ ఉంటాయి. మీరు కూడా రెడీ గా ఉండండి. వచ్చే వారమే గేమ్ ఛేంజర్ నుంచి తర్వాత అప్డేట్ రానుంది. మీకు నచ్చుతుంది .. అదిరిపోతుంది కూడా..’ అంటూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఇదిలావుండగా దర్శకుడు శంక ర్ కి చాదస్తం బాగా ఎక్కువ. 2021 లో ‘గేమ్ ఛేంజర్’ ని ప్రారంభించాడు శంకర్. ఇప్పటికీ ఈ సినిమా రిలీజ్ కాలేదు. ఏదేదో షూట్ చేస్తాడు. తర్వాత అది బాలేదు అని చెప్పి దాన్ని డిలీట్ చేయిస్తాడు. ఇలా ‘గేమ్ ఛేంజర్’ విషయంలో రూ.100 కోట్ల ఫుటేజీని అతను వేస్ట్ చేసినట్లు సమాచారం.మరోవైపు రాంచరణ్ డేట్స్ కూడా వేస్ట్ చేయించాడట శంకర్. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాకి కూడా చరణ్ అన్ని డేట్స్ ఇవ్వలేదు అని అతని టీం చెబుతుంది. ‘గేమ్ ఛేంజర్’ తో సమానంగా ‘ఇండియన్ 2’ ని ప్రారంభించి ఎక్కువ టైం దానికే కేటాయిస్తూ వచ్చాడట శంకర్. 

క్రమంలో చరణ్ డేట్స్ ఇచ్చే టైంకి శంకర్  ‘ఇండియన్ 2’ తో బిజీగా ఉండేవాడట. అయినప్పటికీ చాలా కాలం ‘గేమ్ ఛేంజర్’ కోసం ఓపిగ్గా ఉంటూ వచ్చాడు చరణ్.అయితే రెండు నెలల క్రితం అతని పార్ట్ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. ‘ఇండియన్ 2’ ప్రమోషన్స్ లో కూడా శంకర్ ‘చరణ్ పార్ట్ షూట్ కంప్లీట్ అయ్యింది’ అని చెప్పాడు.అయితే ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్యాచ్ వర్క్ కోసం మళ్ళీ చరణ్ డేట్స్ కావాలి అంటూ దిల్ రాజుని అడిగాడట శంకర్. ఈ క్రమంలో దిల్ రాజు రాంచరణ్ డేట్స్ అడగ్గా, అతను సున్నితంగా తిరస్కరించాడట.ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సినిమా మేకోవర్ కోసం చరణ్ బాగా కష్టపడుతున్నాడట. అందువల్ల ‘గేమ్ ఛేంజర్’ కి డేట్స్ ఇవ్వలేను అని ఓపెన్ గా చెప్పేశాడట. అయితే శంకర్ మాత్రం దిల్ రాజుపై ఒత్తిడి పెంచుతూనే ఉన్నాడట. సో అటు చరణ్, ఇటు శంకర్ల మధ్య దిల్ రాజు నలిగిపోతున్నట్టు స్పష్టమవుతుంది.ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ మూవీ నుంచి గతంలో జరగండి జరగండి… అంటూ సంగీత దర్శకుడు తమన్ పక్కా పెప్పీ మాస్ నంబర్ అందించారు. అది చార్ట్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు రెండో సాంగ్ కోసం మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. వినాయక చవితికి రెండో సాంగ్ ఈ నెలలో రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ, ఇప్పటి వరకు ఆ అప్డేట్ లేదు. దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదురయ్యాయి. రెండో పాటను సెప్టెంబర్ 30 న రిలీజ్ చేయటానున్నట్లు ప్రకటించారు. కాగా దీనిపై మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డ్యూయట్ సాంగ్ వస్తుందా, లేక సోలో సాంగ్ లో రామ్ చరణ్ కనిపిస్తాడా అని వెయిట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: