యాంకర్ రష్మీ తన టీవీ షోలతో పాటు నిత్యం ఏదోఒక విషయం పై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తూనేవుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మీ మూగజీవాల సంరక్షణకుసంబందించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే సమాజంలో జరిగే సంఘటనల పై కూడా స్పందిస్తూ ఉంటుంది. తాజాగా రష్మీ తన ఇంటర్వ్యూని వైరల్ చెయ్యొద్దు అని విజ్ఞప్తి చేసింది. కాస్టింగ్ కౌచ్ పై తన చేసిన కామెంట్స్ ను వైరల్ చెయ్యొద్దు అని రిక్వెస్ట్ చేసింది.సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి నిత్యం ఎదో ఒక వార్త వస్తూనే ఉంది. రీసెంట్ గా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిని పోలీసుకు అదుపులోకి తీసుకుంటున్నారు. యువతిని వేధించిన కేసులో ఇప్పటికే హీరో రాజ్ తరుణ్,కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్,ఇప్పుడు యూట్యూబర్ హర్షసాయి పై ఆరోపణలు వచ్చాయి. అలాగే మలయాళ ఇండస్ట్రీలోనూ లైంగిక వేధింపుల పై పెద్ద రచ్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో రష్మీకి సంబందించిన ఓ పాత ఇంటర్వ్యూ వైరల్ గా మారింది.
 ఈ నేపథ్యంలో గతంలో క్యాస్టింగ్ కౌచ్ పై ఈమె చేసిన కామెంట్స్ ను ఇప్పుడు వైరల్ చేయడంతో ఆమె ఈ విధంగా రిక్వెస్ట్ చేస్తున్నట్లు సమాచారం.గతంలో రష్మీ మాట్లాడుతూ మైనర్ ను లైంగికంగా వేధింపులకు గురి చేయడం, క్యాస్టింగ్ కౌచ్ కి మధ్య చాలా తేడా ఉంది .ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యక్తిగత అభిప్రాయాలకు సంబంధించినది. ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒక సినీ ఇండస్ట్రీలోనే కాదు చాలా చోట్ల ఉంది. ఇలాంటివి ఎదురైనప్పుడు నో చెప్పాలి. అయితే కొంతమంది కెరియర్ లో ముందుకెళ్లడానికి ఇలాంటివి ఎదురైనప్పుడు ఓకే చెబుతున్నారు. ఎవరు ఇక్కడ ఎవరిని బలవంతం చేయరు. ఒకవేళ అత్యాచారం చేస్తే తప్పు అంటూ రష్మి చెప్పుకొచ్చింది.అయితే ఇటీవల కొరియోగ్రాఫర్ మైనర్ మహిళా కొరియోగ్రాఫర్ పై అత్యాచారం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గతంలో రష్మిక చేసిన వీడియోని ఈ వార్తలకు జోడించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దాంతో ఆమె అది తన పాత ఇంటర్వ్యూ అని , దయచేసి దానిని వైరల్ చేయవద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తోంది. మొత్తానికి అయితే గతంలో చేసిన ఈ ఇంటర్వ్యూ ని ఇప్పుడు అడ్డం పెట్టుకొని జానీ మాస్టర్ పై కామెంట్లు చేసింది అంటూ కొంతమంది ట్రోల్స్ చేస్తుండడంతో..ఎరక్కపోయి ఇప్పుడు ఇరుక్కుపోయింది అంటూ నెటిజన్లు కామెంట్ లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: