అభిమానుల ఆకలి తీర్చడానికి.. బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేయడానికి.. మరోసారి తన నట విశ్వరూపంతో ప్రేక్షకులను అలరించడానికి.. ఆరేళ్ల తర్వాత సోలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అరవింద సమేత సినిమా తర్వాత.. త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చినా.. ఇక ఇందులో తారక్ పాత్ర కేవలం సైడ్ హీరో పాత్ర లాగే ఉంది అంటూ విమర్శలు వచ్చాయి. దీంతో అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా కాస్త ఫీలయ్యారు.


 దీంతో తారక్ సోలో హీరోగా సినిమా ఎప్పుడు వస్తుందో అని అభిమానులు అందరూ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చేశారు. ఇక ఇప్పుడు ఆరేళ్ల గ్యాప్ తర్వాత తారక్ దేవర పార్ట్ వన్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు అని చెప్పాలి. ఈ నెల 27వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో తారక్ సరసన జాన్వికపూర్ నటించింది. అయితే ఈ సినిమాకు ఏర్పడిన బజ్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించడం ఖాయంగానే కనిపిస్తుంది. అయితే దేవర తర్వాత తన కెరీర్ను పూర్తిగా మార్చేసుకోవాలని ఎన్టీఆర్ నిర్ణయం తీసుకున్నారట. గత కొంతకాలం నుంచి ఒక్కో సినిమాకి ఒకటి రెండేళ్లు గ్యాప్ తీసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్.


 ఇక ఇప్పుడు వార్ 2, డ్రాగన్, దేవర పార్ట్ 2 లాంటి పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకులను వరుసగా ప్రేక్షకులను అలరించేందుకు  సిద్ధమయ్యాడు. అయితే ఇక ఇప్పుడు ఏడాదికి ఒక సినిమా చొప్పున విడుదల చేయాలని ఎన్టీఆర్ ఇప్పటికే ప్లాన్ చేస్తున్నాడట. కాగా గతంలో ఎన్టీఆర్ సినిమాల మధ్య ఎంత గ్యాప్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడట ఎన్టీఆర్. ఏడాదికి రెండు సినిమాలు చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదట. అయితే తారక్ అన్న ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఆయన అభిమానులుగా మాకు ఇంతకంటే ఇంకేం కావాలి అంటూ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: