నటసింహం నందమూరి బాలకృష్ణ తన 109వ సినిమాని బాబీ కొల్లి డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. 'అఖండ', 'వీరసింహ రెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో 'NBK 109'పై భారీ అంచనాలున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి 'వీరమాస్' అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నవంబర్ నాటికి మొత్తం షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. అంతేకాదు, తాజాగా రిలీజ్ డేట్ ని కూడా లాక్ చేసినట్లు వినికిడి.ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే 'NBK 109' ని 2025, సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారట. జనవరి 12న ఈ చిత్రం థియేటర్లలో అడుగుపెట్టనుందని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని అంటున్నారు. కాగా ఇప్పటికే 2025 సంక్రాంతి సీజన్ పై 'విశ్వంభర' తో మెగాస్టార్ చిరంజీవి కర్చీఫ్ వేశారు. మల్లిడి వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ జనవరి 10న విడుదల కానుంది.అయితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నా అధికారికంగా ఇందుకు సంబంధించి స్పష్టత లేదనే సంగతి తెలిసిందే. 2025 జనవరి 12న ఈ సినిమా రిలీజవుతుందని కొన్ని కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. వాస్తవానికి జనవరి 12వ తేదీ ఆదివారం కావడంతో ఈ సినిమా ఆ తేదీకి రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు.

బాలయ్య బాబీ కాంబో మూవీ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ ప్రకటన ఆలస్యమైతే ఇతర సినిమాల డేట్లతో క్లాష్ అయ్యే అవకాశం ఉంటుంది. దసరా పండుగ సమయంలోనైనా టైటిల్, రిలీజ్ డేట్ గురించి క్లారిటీ వస్తుందేమో చూడాల్సి ఉంది. జనవరి 9వ తేదీ ఈ సినిమాకు బెస్ట్ డేట్ అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రిలీజ్ డేట్ విషయంలో ఆలస్యం చేసి బాలయ్య తప్పు చేయవద్దని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఇదిలావుండగా ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ బాబీ డియోల్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రగ్యా జైస్వాల్‌ నటిస్తూ ఉండగా మరో హీరోయిన్‌ గా ఊర్వశి రౌతేలా నటిస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఇప్పటి వరకు ఈ విషయాలపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ వార్తలన్నింటికి దసరా కానుకగా విడుదల అవ్వబోతున్న టైటిల్‌ తో కూడిన ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ ఇంకా ఫస్ట్‌ సింగిల్‌ క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సోషల్‌ మీడియాలో ఈ సినిమా గురించి పుకార్లు కుప్పలు తెప్పలుగా షికార్లు చేస్తున్న నేపథ్యంలో అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ వెయిట్‌ చేస్తున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌ లో నాగ వంశీ నిర్మిస్తుండగా, త్రివిక్రమ్‌ సతీమణి సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. థమన్‌ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: