టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ ప్రేమించి మరి బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ భగ్నానిని వివాహం చేసుకుంది.. అయితే వివాహం తర్వాత జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రకుల్ ప్రీతిసింగ్ సినిమాలలో కాస్త హవా తగ్గించింది. అయితే జాకి నిర్మాత కావడంతో ఆయన బ్యానర్లో పనిచేసిన కొంత మంది ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేదంటూ చాలా మంది కేసు వేయడం కూడా జరిగింది. మరి కొంతమంది ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. సుమారుగా జాకీ కి 200 కోట్ల రూపాయలు తన బ్యానర్ మీద తెరకెక్కించిన సినిమాల వల్ల నష్టం రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు.


ఇప్పుడు తాజాగా బాలీవుడ్ లో డైరెక్టర్ గా పేరుపొందిన ఆలీ అబ్బాస్ జాఫర్ పైన జాకీ భగ్న కేసు వేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. టైగర్ జిందా హై, సుల్తాన్ వంటి చిత్రాలకు దర్శకుడుగా వ్యవహరించారు డైరెక్టర్ ఆలీ. అలాగే టైగర్ ష్రాప్, అక్షయ్ కుమార్ కాంబినేషన్లో బడే మియాన్ చోటేమియాన్ -2 సినిమాని తెరకెక్కించారు. సుమారుగా ఈ చిత్రాన్ని రూ .300 కోట్ల రూపాయలతో కెరకెక్కించగా కేవలం రూ .120 కోట్లు మాత్రమే వచ్చింది.. దీంతో ఘోరమైన డిజాస్టర్ గా మూటగట్టుకుంది. అయితే ఈ చిత్ర నిర్మాణంలో డైరెక్టర్ ఆలీ అబ్బాస్ కూడా భాగమయ్యారట.


ఈ నిర్మాణానికి ఇచ్చిన డబ్బులను ఖర్చు పెట్టకుండా తన పర్సనల్ ఖర్చులకు వాడుకున్నాడు అంటూ రకుల్ ప్రీతిసింగ్ భర్త జాకి ఈ డైరెక్టర్ పైన కేసు వేసినట్లు తెలుస్తోంది. దీనిపైన పోలీసులు డైరెక్టర్ ఆలీ అబ్బాస్ కి సైతం నోటీసులు పంపించారు. ఇప్పుడు ఈ విషయం బాలీవుడ్ లోనే ఒక చర్చనీయాంశంగా మారుతున్నది. సుమారుగా కొన్ని కోట్ల రూపాయలు పూజ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన జరకెక్కించగా చాలా మందికి నష్టాలు ఎదురయ్యాయట. దీంతో రకుల్ ప్రీతిసింగ్ అభిమానులు కూడా కాస్త నిరాశతో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: