తిరుమల లడ్డు వివాదం కాస్త సినీ నటుడు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ల వివాదంగా మారిపోయింది.తిరుమల లడ్డు వివాదంలో పవన్ కళ్యాణ్ హిందూ ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం మన బాధ్యత అంటూ మాట్లాడారు.అయితే ఈయన మాటలపై ప్రకాష్ రాజ్ ఎందుకు మీరు అలాంటి ట్వీట్లు పెడుతున్నారు.. ఎందుకు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు.. అంటూ ట్వీట్ చేశారు.అయితే ప్రకాష్ రాజ్ ట్వీట్ పై పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకాష్ రాజ్ పై ఫైర్ అయ్యారు.నేను ఏ మతాన్ని నిందించడం లేదు.. నాకు అన్ని మతాలు అంటే గౌరవం అంటూ మాట్లాడారు.ఇక ప్రకాష్ రాజు పవన్ మాటలపై మీరు నేను పెట్టిన ట్వీట్ సరిగ్గా చూడలేదు కావచ్చు.. వీలైతే మళ్లీ ఒకసారి నా ట్వీట్ చదవండి అని సెటైర్ వేశారు.

ఇలా వీరిద్దరి మధ్య ఎక్స్ వేదిక గా ట్వీట్ ల వివాదం కొనసాగుతోంది. అలాగే రీసెంట్ గా హీరో కార్తీ లడ్డు గురించి మాట్లాడగా ఆయనపై కూడా పవన్ ఫైర్ అయ్యారు.దాంతో కార్తీ,సూర్య ఇద్దరు పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు చెప్పారు. ఇక  క్షమాపణలు చెప్పడంలో కూడా ప్రకాష్ రాజ్ ఒక వివాదాస్పద ట్వీట్ చేశారు అడిగి మరీ క్షేమపణలు ఏంటయ్యా అంటూ ట్వీట్ పెట్టారు.అయితే తాజాగా పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ వేశారు.

ఇక ఆ ట్వీట్ లో ఏం పెట్టారంటే.. గెలిచే ముందు ఓ అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటి ఈ అవాంతరం.. ఎందుకు మనకీ అయోమయం.. ఏది నిజం.. జస్ట్ ఆస్కింగ్ అంటూ ఒక సంచలన ట్వీట్ పెట్టారు. అయితే ఈ ట్వీట్ లో ప్రకాష్ రాజ్ ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ పేరు మెన్షన్ చేయకపోయినప్పటికీ అందరూ పవన్ కళ్యాణ్ పైనే పరోక్షంగా ఈ ట్వీట్ చేశారని అందరూ అనుకుంటున్నారు. మరి వీరిద్దరి మధ్య ఈ ట్వీట్ల వివాదం ఇంకా ఎక్కడి వరకు దారితీస్తుందో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: