దర్శక ధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ కాంబోలో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే జక్కన్న ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపికను కూడా మొదలుపెట్టాడు. ఇదే క్రమంలో గతంలో ఈ సినిమాలో హీరోయిన్ గా ఇండోనేషియా నటి చెల్సియా ఇస్లాన్‌ను ఎంపిక చేసాడనే వార్త కూడా వినిపించింది. అదేవిధంగా రాజ‌మౌళి ఆమెను స్క్రీన్ టెస్ట్ చేశాడని టాక్‌ కూడా నడిచింది.


చెల్సియా అమెరికాలో జన్మించిన ఇండోనేషియాన్‌ నటి. ఈమె 2014 నుండి 2017 వరకు ప్రసారమైన పాపులర్ సిట్‌కామ్ టెటాంగా మాసా గిటులోని తన పాత్రతో పాపుల‌రైంది. 2015 నుండి 2018 వరకు వరుసగా నాలుగు ఇండోనేషియన్ ఛాయిస్ అవార్డులను గెలుచుకుంది. ఇక ఈ భామ‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతో క్రేజ్‌ ఉంది. అందుకే రాజ‌మౌళి చెల్సియాను ఫైన‌ల్ చేసార‌ని టాక్‌.


అంతేకాకుండా భారీ ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కనున్న ఈ మూవీలో ముగ్గురుకు కు పైగా హాలీవుడ్ హీరోయిన్లు నటించేందుకు అవకాశం ఉందని కూడా టాలీవుడ్ వర్గాల నుంచి వార్తలు వస్తున్నాయి. రాజమౌళి హ‌లీవుడ్‌లో ఒక టాప్ కాస్టింగ్ ఏజెన్సీని నియమించుకుని అంత‌ర్జాతీయ స్టార్ల‌కు వ‌ల వేస్తున్నార‌ట‌. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న లేదు. ఆర్.ఆర్.ఆర్ తో రాజ‌మౌళి బ్రాండ్ అంత‌ర్జాతీయ విఫ‌ణికి ప‌రిచ‌య‌మైంది. అందుకు మ‌హేష్ సినిమాని కేవ‌లం పాన్ ఇండియాకే ప‌రిమితం చేయ‌కుండా, ఇత‌ర ప్ర‌పంచ దేశాల్లో కూడా త‌న‌ మార్కెట్‌ను పెంచు కొవ‌ల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు గుస‌గుస వినిపిస్తోంది.



అందుకే కాస్టింగ్ ప‌రంగా, సాంకేతికంగా కూడా ఈ మూవీని మ‌రో లెవ‌ల్ లో రూపొందించాల‌ని ప్లాన్ చేస్తున్నార‌న‌ట‌.
ఇప్పటికే ఈ సినిమాలో మహేష్ కు సంబంధించిన లుక్ కూడా ఫైనల్ అయింది. అదేవిధంగా ఇందులో మహేష్ కు విలన్ గా ఐరన్ మాన్ సిరీస్ లో నటించిన స్టార్ హీరోను రాజమౌళి ఎంపిక చేస్తాడని టాక్ కూడా ఉంది. ఇక మరి రాజమౌళి మహేష్ తో ప్రపంచ సినిమాపై ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: