దివంగత నటీమణి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలోకి జాన్వీ కపూర్ బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒకటి రెండు చిత్రాలతో పర్వాలేదు అనిపించుకుంది. కానీ సాలిడ్ హిట్ అయితే ఈమె ఖాతా లో ఒకటి కూడా లేదని చెప్పవచ్చు. అయితే శ్రీదేవి కూతురు అన్న కారణముతో టాలీవుడ్ లో ఈమెకు అవకాశాలు వచ్చి పడుతున్నాయి. అయితే దీనిని అదునుగా తీసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పారితోషకం పెంచేసి అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో అవకాశాలే లేని సమయంలో టాలీవుడ్ కి ఆఫర్ రావడంతో ఇక్కడికి వచ్చింది.అయితే ఈ ఆఫర్ ఈమెకు అదృష్టంగా మారిందని చెప్పవచ్చు.

తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాలో హీరోయిన్ గా అవకాశం అందుకుంది. అయితే ఈ సినిమా అలా విడుదలై అప్పుడే తన రెండవ సినిమాకు రెమ్యునరేషన్ పెంచేసింది ఈ ముద్దుగుమ్మ. తల్లి కోసమే ఇక్కడ నటిస్తున్నట్లు వార్తలు వినిపించినా..  అడుగు పెట్టిన వెంటనే పొగరు చూపిస్తోంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. తాను దేవకన్యలా, అపురూప సుందరిలా ఫీల్ అయిపోతుంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.


ఇక్కడ ఆశ్చర్యపోయే మరో విషయం ఏమిటంటే.. నిర్మాతలకి కూడా ఊహించని రేంజ్ లో పారితోషకం పెంచేసి చుక్కలు చూపిస్తోందని చెప్పవచ్చు. నిజానికి దేవరా సినిమాతోనే పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అంతకుముందు బాలీవుడ్ కే పరిమితమైన ఈమెకు తెలుగు ఇండస్ట్రీ ఈ రేంజ్ లో గుర్తింపు అందించిందని చెప్పవచ్చు. అయితే బాలీవుడ్ లో రూ .2కోట్ల వరకే పారితోషకం తీసుకున్న ఈమె.. టాలీవుడ్కు వచ్చేసరికి దేవర కోసం ఏకంగా రూ .5కోట్లు తీసుకుంది. మరొకవైపు ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతున్న నేపథ్యంలో.. తన తదుపరి చిత్రానికి ఏకంగా రూ .7 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మరి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా పొగరు చూపిస్తూ డిమాండ్ చేస్తున్న ఈమెకు నెక్స్ట్ పరిస్థితి ఏంటో అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: