జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు. అయితే అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఆరు సంవత్సరాల తర్వాత దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అరవింద సమేత 2018 సంవత్సరంలో వచ్చింది. ఈ దేవర సినిమాతో ఆరు సంవత్సరాల తర్వాత సోలోగా ఎంట్రీ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించగా.. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా చేయడం జరిగింది.

 అయితే ఈ సినిమాలో హీరోయిన్ జాన్వి కపూర్ పాత్ర చాలా తక్కువ. ఎక్కడా కూడా జాన్వి కపూర్ కనిపించలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి తీసుకువచ్చిన కొరటాల శివ...  టాలీవుడ్ లో హైలెట్ చేయలేకపోయాడు. ఫస్ట్ ఆఫ్ లో అసలు జాన్వి కపూర్ ఎక్కడ కనిపించలేదు. సెకండ్ హాఫ్ లో పదంటే పది నిమిషాలు మాత్రమే సందడి చేసి అలా వెళ్ళిపోయింది. చుట్ట మలే వచ్చి... చుట్టంలాగే వెళ్ళిపోయింది జాన్వికపూర్.

 అయితే జాన్వి కపూర్ పాత్రను తక్కువ చేయడం పై కొరటాల శివ పై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో...  టాలీవుడ్ ఇండస్ట్రీలో జాన్వి కపూర్ రాణించడం కష్టమేనని చెబుతున్నారు. శ్రీ లీల అలాగే  కృతి శెట్టి లాగా జాన్వి కపూర్ మారిపోతుందని కొంతమంది చెబుతున్నారు. శ్రీనిల అలాగే కృతి శెట్టి మొదట్లో బంపర్ హిట్ సినిమాలు అందుకున్నారు. చెరొక హిట్ అందుకున్న తర్వాత వరుసగా అవకాశాలు దక్కించుకున్నారు.

 కానీ ఆ తర్వాత శ్రీ లీలా మరియు కృతి శెట్టి సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.  ఇప్పుడు ఆ ఇద్దరు హీరోయిన్లతో సినిమాలు చేయాలంటే నిర్మాతలు భయపడిపోతున్నారు. అయితే వారిద్దరి పరిస్థితి హీరోయిన్ జాన్వి కపూర్ కు ఎదురవుతుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తే జాన్వికపూర్ కు మిగిలింది ఏమి లేదు అని చెబుతున్నారు. దేవర సినిమా ఆవరేజ్ టాక్ ఉన్న నేపథ్యంలో.. ఆమెకు భవిష్యత్తులో ఛాన్సులు రావడం తెలుగులో కష్టమేనని అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: