జూ.ఎన్టీఆర్ నటించిన "దేవర" ఎట్టకేలకు థియేటర్లలోకి రిలీజ్ అయింది. అయితే రివ్యూస్ మాత్రం నెగిటివ్ గానే వస్తున్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ బాంబ్ అవుతుందని క్రిటిక్స్, ఆడియన్స్ కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దేవర పార్ట్-1 సినిమా హిట్ అవుతుందని ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఇది అట్టర్ ఫ్లాప్ దిశగా వెళ్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కూడా నటిస్తున్నారని తెలిసి, ప్రేక్షకుల ఆసక్తి మరింత పెరిగింది. సైఫ్ అలీ ఖాన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. అయితే కొద్ది రోజుల క్రితం విడుదలైన ట్రైలర్ చేసే ప్రేక్షకులు చాలా నిరాశ చెందారు. ఎందుకంటే, ఈ ట్రైలర్ ప్రకారం చూస్తే, సినిమా అంత బాగుండకపోవచ్చు అని అనిపించింది.

ట్రైలర్ విడుదలైన తర్వాత చాలామంది తమ అభిప్రాయాలు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. వారిలో ఒకరు ఈ సినిమా ట్రైలర్ చాలా బోరింగ్‌గా ఉందని, ఇలాంటి సినిమాలు ఇంతకుముందే చాలా వచ్చాయని, ఈ సినిమాని థియేటర్‌లో కంటే యూట్యూబ్‌లో విడుదల చేయడం బెటర్ అని అన్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం, ఈ సినిమాని యూట్యూబ్‌లోనే చూడొచ్చు, అంతా కూడా ఇలాంటి రొటీన్ సినిమాలే చేస్తున్నారని చెప్పారు.

మరొకరు ఈ ట్రైలర్ చాలా చెత్తగా ఉందని అన్నారు. తాను పెద్ద సినిమాలను చాలా ఇష్టపడినా, ఈ సినిమా అసలు నమ్మశక్యంగా లేదని చెప్పారు. ముఖ్యంగా, షార్క్ ఉన్న సీన్ చాలా హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఈ సినిమాటోగ్రఫీ కూడా చాలా డార్క్ గా ఉందని దీన్ని తీసి కూడా వేస్ట్ అని మరికొంతమంది అన్నారు. ఇక సెకండ్ ట్రైలర్ కూడా సేమ్ ఇలాగే ఉంది. దాన్ని చూసి ఈ మూవీ స్టోరీ జవాన్ లాగా నే ఉందే అని కామెంట్లు చేశారు. మొత్తం మీద రాజమౌళితో సినిమా తీసిన తర్వాత ఎవరైనా ఫ్లాప్ అందుకోవాల్సిందే. చివరికి ఎన్టీఆర్ కూడా మరొకసారి బలైపోతున్నారు. కొరటాల శివ కారణంగానే ఇది జరిగిందని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: