మెగాస్టార్ చిరంజీవి తన కెరియర్లో ఎన్నో రీమిక్ సినిమాల లో నటించిన విషయం మనకు తెలిసిందే . ఆయన రీమిక్ సినిమాల ద్వారా బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి . రాజ శేఖర్ నటించిన ఓ బ్లాక్ బాస్టర్ మూవీ ని చిరంజీవి హిందీ లో రీమిక్ చేశాడు . కానీ ఈ సినిమా మాత్రం తెలుగులో సాధించిన స్థాయి విజయాన్ని హిందీ లో సాధించలేదు. ఆ సినిమా ఏది ఆ వివరాలు ఏమిటి తెలుసు కుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం కోడి రామకృష్ణ దర్శకత్వంలో శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మాతగా రాజశేఖర్ హీరోగా అంకుశం అనే మూవీ రూపొందింది. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో రాజశేఖర్ కి అద్భుతమైన క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. అప్పటిదాకా సాఫ్ట్ పాత్రలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజశేఖర్ ఈ సినిమాలో పవర్ఫుల్ పాత్రలో నటించి తనలోని నటనలో మరో కోణాన్ని చూపించాడు.


ఇక తెలుగు బాక్సాఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమాను రవిరాజ పినిశెట్టి "ప్రతి బంద్" అనే టైటిల్ తో మెగాస్టార్ చిరంజీవి హీరోగా హిందీ లో రీమేక్ చేశాడు. ఇక ఈ సినిమాతోనే చిరంజీవి హిందీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ లో చిరంజీవి కి జోడిగా జుహీ చావ్లా నటించింది. రామిరెడ్డి ఈ మూవీ లో విలన్ గా నటించాడు. అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమా హిందీ లో పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని మాత్రమే అందుకుంది. ఇక రాజశేఖర్ "అంకుశం" సినిమాతో అందుకున్న స్థాయి విజయాన్ని చిరంజీవి "ప్రతి బంద్" మూవీ తో అందుకోలేకపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: