పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన యాక్షన్ డ్రామా చిత్రం దేవర. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించాడు. ఈ సినిమాను సముద్రం కథ ఆధారంగా రూపొందించారు. ఇందులో ఎన్టీఆర్ ద్వీపాత్రాభినయం పోషించాడు.

కొన్ని సంవత్సరాల నుంచి ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని వెయిట్ చేపిస్తూ ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. కానీ ఈ సినిమా నెగిటివ్ టాక్ మూట కట్టుకుంటుంది. ఈ సినిమాలో చాలా ల్యాగ్ ఉందని, బోర్ కొట్టే సీన్లు ఎక్కువగా ఉన్నాయని, పాటలలో గ్లామర్ తప్పితే జాన్వి కపూర్ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. జాన్వీ కపూర్ పాత్ర చాలా తక్కువ సమయం ఉందని దానివల్ల సినిమాకు పెద్దగా ప్లస్ అవ్వలేదని అంటున్నారు.

అయితే...దేవర సినిమా నెగిటివ్ టాక్ వస్తున్న తరుణంలో... బాలయ్య కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.  ఇటీవల ఓ సినిమా ఈవెంట్ లో బాలకృష్ణ, అల్లు శిరీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు శిరీష్, బాలకృష్ణ మధ్య సరదాగా కొంతసేపు సంభాషణ సాగింది. ఇంతలో శిరీష్ మైక్ పట్టుకొని బాలయ్య వద్దకు వచ్చి....సార్ మీ సినిమాలన్నీ ఎక్కువగా సింహ అనే పేరుతోనే ఉంటాయి. అది మీ సెంటిమెంటా.... ఆ పేరుతో వచ్చిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి కదా అన్నారు.

దానికి బాలకృష్ణ వెంటనే అవును అని సమాధానం ఇచ్చి సింహ అంటే సెంటిమెంట్ గా మారింది. "సింహం నవ్వింది" సినిమా మాత్రం డిజాస్టర్ అయ్యిందని బాలకృష్ణ అన్నారు. ఆ సినిమా మాత్రం పోయిందని, ఫ్లాప్ అయ్యిందని అన్నారు. దీంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వారు. వెంటనే బాలయ్య సింహం నవ్వడం ఏంటి టైటిలే తప్పుగా పెట్టారు. అందుకే ఆ సినిమా డిజాస్టర్ అయిందన్నారు. ప్రస్తుతం బాలయ్య చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: