ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా ఈ రోజున విడుదల కావడం చేత ఒక వారం రోజులపాటు మరే సినిమా కూడా విడుదల చేయడానికి ధైర్యం చేయరు. వచ్చేవారం కూడా పెద్ద సినిమాలు లేకపోవడంతో ఇక జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు నిలబడడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలోనే చిన్న సినిమాలు కూడా విడుదల చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. అయితే తమిళంలో మాత్రం గట్టి పోటీ ఇచ్చేలా మెయ్య జగన్ అనే సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.


సినిమా తమిళంలో దేవరకు గట్టి పోటీగా ఇచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. తెలుగులో అయితే కార్తీ, అరవిందస్వామి నటించిన సత్యం సుందరం అనే సినిమాని తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. రేపటి రోజున ఈ సినిమాని విడుదల చేసే విధంగా ప్లాన్ చేశారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా కుటుంబ కథ ఉన్నట్లుగా ఆసక్తి పెంచిన.. ఫీల్ గుడ్ మూవీ మేకర్స్ ప్రజెంటేషన్ చేయడంతో ఈ సినిమా మంచి విజయం అందుకుంటుందని కార్తి అభిమానులు కూడా భావిస్తున్నారు.


ఈ చిత్రాన్ని తమిళంలో 96 సినిమా రూపొందించిన డైరెక్టర్ ప్రేమ్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మరి దేవర సినిమా వల్ల సత్యం సుందరం సినిమాకు తగ్గాల్సిన క్రేజ్ మాత్రం దక్కడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సినిమాని ఒక వారం ముందు లేదా ఆ తర్వాత రిలీజ్ చేసుకుంటే కాస్త క్రేజ్ పెరిగే అవకాశం ఉండడమే కాకుండా థియేటర్లు ఎక్కువగా లభిస్తాయని ఓపెనింగ్ కూడా ఎక్కువగా వస్తాయని చెప్పవచ్చు. మరి దేవర జాతర ముందు కార్తీ సినిమా రిస్క్ తో కూడిన పని అని అభిమానులు భావిస్తున్నారు. అంతేకాకుండా తమిళంలో విడుదలైన మరుసటి రోజు తెలుగులో రిలీజ్ కాబోతుండడంతో ఫలితాలు మారవచ్చు అని కూడా చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో రేపటి రోజున చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: