లేటెస్ట్ గా విడుదలైన ‘దేవర’ మూవీకి డివైడ్ టాక్ రావడంతో ఈమూవీ బ్లాక్ బష్టర్ హిట్ అవ్వడం కష్టం అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మూవీకి 180 కోట్లకు పైగా బిజినెస్ అవ్వడంతో ఈ మూవీ బయ్యర్లు ‘దేవర’ కు వచ్చిన డివైడ్ టాక్ వల్ల క్షేమంగా బయటపడగలరా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.



ఇది ఇలా ఉండగా ఈసినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఎంతవరకు తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీలో ఈమూవీ తరువాత టాప్ హీరోయిన్ గా సెటిల్ కాగలదు అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వర ను ప్రేమించే తంగమ్మ గా జాన్వీ పాత్రకు ఈమూవీలో చాల తక్కువగా ఆమె నిడివి ఉండటంతో ఆమె గురించిన చర్చలు పెద్దగా జరగండంలేదు.



దీనికితోడు ఆమె పాత్ర సెకండ్ హాఫ్ లో రావడంతో ప్రేక్షకులు ఈమె పాత్రకు పెద్దగా కనెక్ట్ కాలేదు. ఈమె పెర్ఫార్మన్స్ గురించి కూడ జనం పెద్దగా పట్టించుకోలేదు. వాస్తవానికి జానవీకపూర్ తన పాత్రమేరకు అందంగా కనిపించడానికి ప్రయత్నిస్తూ హుషారుగా నటించినప్పటికీ ఆమె పాత్రను చూసిన సగటు ప్రేక్షకుడు ఆమె పాత్రలో ‘రంగస్థలం’ సినిమాలోని సమంత పాత్రను గుర్తు చేసుకున్నారు. జూనియర్ నటించిన వర పాత్రతో ఆమె రొమాన్స్ పెద్దగా రక్తికట్టలేదు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.  



దర్శకుడు కొరటాల దృష్టి అంతా ‘దేవర’ పాత్ర పై పెట్టడంతో జాన్వీ నటించిన తంగమ్మ పాత్ర తేలిపోయింది అంటు మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనితో జాన్వీ బుచ్చిబాబు దర్శత్వంలో రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న నేపధ్యంలో ఆసినిమా ఘనవిజయం బట్టి టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో జాన్వీ కపూర్ భవిష్యత్ ఆధార పడిఉంటుంది అని అంటున్నారు. ఈ సినిమా కోసం జాన్వీ 5 కోట్లు పారితోషికం ఇచ్చారు అని వస్తున్న వార్తలను బట్టి ప్రస్తుతానికి టాలీవుడ్ లో ఆమె క్రేజ్ ఏ రేంజ్ ఉందో అర్థం అవుతుంది..    






మరింత సమాచారం తెలుసుకోండి: