ఈ మధ్యకాలంలో బాలీవుడ్ సెలబ్రిటీలు డేటింగ్ యాప్‌లలో కనిపించడం వల్ల చాలా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా హృతిక్ రోషన్, ఆదిత్య రాయ్ కపూర్ లాంటి పెద్ద స్టార్ల పేర్లు ఈ విషయంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి నటి ఊర్వశి రౌతేలా తన అభిప్రాయాన్ని తెలియజేసింది. ఆమె మాట్లాడుతూ, "హృతిక్ రోషన్, ఆదిత్య రాయ్ కపూర్ లాంటి చాలామంది పెద్ద స్టార్లు ఈ డేటింగ్ యాప్‌లలో ఉన్నారు. మేం మా ఫ్రీ టైమ్‌లో చాట్ చేయడానికి ఈ యాప్‌లలో లాగిన్ అవుతాము. దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. మేము కనెక్ట్ అయి ఉండడానికి, బ్రేక్స్ వచ్చినప్పుడు మాట్లాడటానికి ఈ యాప్‌లను ఉపయోగిస్తాము. ఇంతకన్నా ఇంకేమీ లేదు" అని చెప్పింది.

ఊర్వశి రౌతేలా తన వ్యాఖ్యల ద్వారా తనపై వస్తున్న వదంతులను తోసిపుచ్చడానికి ప్రయత్నించింది. ఆమె కేవలం ఖాళీ సమయంలో చాట్ చేయడానికి మాత్రమే డేటింగ్ యాప్‌లను ఉపయోగిస్తున్నట్లు చెప్పింది. ఇలాంటి వదంతులు సోషల్ మీడియాలో చాలా కామన్. సెలబ్రిటీలు ఏం చేసినా వార్త అవుతుంది.

ఊర్వశి రౌతేలా ప్రస్తుత ప్రాజెక్టుల గురించి తెలుసుకుంటే బాలకృష్ణ హీరోగా వస్తున్న 'NBK 109' సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాని బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఊర్వశిసినిమా గురించి మాట్లాడుతూ, తన పాత్ర చాలా ప్రత్యేకమని, ఇంతకు ముందు తాను చేయని రకమైన పాత్ర ఇది అని చెప్పింది. "ఈ పాత్రకు చాలా బలమైన కథ ఉంది. ప్రేక్షకులు నన్ను కొత్త కోణంలో చూస్తారు" అని ఆమె అన్నారు.

ఊర్వశి తన కో-స్టార్ బాలకృష్ణ గురించి చాలా మంచిగా చెప్పింది. ఆయన నటన మాత్రమే కాకుండా, ఆయన వ్యక్తిత్వం గురించి కూడా ప్రశంసించింది. బాలకృష్ణ చాలా మంచి మనిషి అని, తెలుగు సినిమా సెట్‌లో చాలా బాగా ఉంటుందని చెప్పింది. ఊర్వశి తెలుగు సినిమా ఇండస్ట్రీలో పని చేయడం చాలా ఇష్టం అని, భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అవకాశాలు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. అంతేకాకుండా, ఊర్వశి ఇటీవల మిస్ యూనివర్స్ ఇండియా 2024 జ్యూరీగా పని చేసింది. దీంతో ఆమె ఎంటర్టైన్మెంట్, ఫ్యాషన్ రంగాల్లో ప్రముఖ వ్యక్తిగా మారింది. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్, తెలుగు సినిమా రెండింటిలోనూ తన కెరీర్‌ను బాగా హ్యాండిల్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: