దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోయిన్లలో సాయి పల్లవి కూడా ఒకరు.. తెలుగు, తమిళ్, కన్నడ ,మలయాళం వంటి భాషలలో కూడా ఎంతమంది అభిమానులను సంపాదించుకుంది ఈ ముద్దు గుమ్మ. ముఖ్యంగా ఈమె డాన్స్ మాట్లాడే విధానం ఇలా ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటు ఉంటుంది. అయితే ఇప్పుడు చాలా కాలం తర్వాత సాయి పల్లవి మరొక అద్భుతమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. దాదాపుగా 2 ఏళ్ల తర్వాత నాగచైతన్యతో తండేల్ సినిమాలో నటిస్తోంది.


 తమిళంలో మరొక సినిమా అమరన్ చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రంలో హీరోగా శివకార్తికేయన్ నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రం ముకుంద వరదరాజన్ అనే వ్యక్తి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మేజర్ గా అమరవీరుడు పొందిన ముకుంద వరదరాజ సినిమా కథన డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోను కూడా సోషల్ మీడియాలో విడుదల చేశారు ఈ వీడియో చూసిన సాయి పల్లవి అభిమానులు కూడా ఈమె యాక్టింగ్ కి మరొకసారి ఫిదా అవుతున్నారు.


సాయి పల్లవి మరొకసారి అందరి హృదయాలను కొల్లగొట్టే విధంగా ఈ సినిమాలో నటించింది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కమలహాసన్ నిర్మిస్తూ ఉన్నారు. అక్టోబర్ 31న తమిళ్ భాషలలో విడుదల కాబోతోంది. ఇందులో ఆ అమరవీరుని భార్య పాత్రలో సాయి పల్లవి నటించ బోతున్నట్లు కనిపిస్తోంది. కచ్చితంగా ఈ సినిమా సాయి పల్లవి సినీ కెరియర్ కు మరో మెట్టు ఎక్కి ఎలా కనిపిస్తోంది. ఇక మేజర్ ముకుంద వరదరాజన్ ఇండియన్ ఆర్మీలో పనిచేసేవారట. 2014లో ఉగ్రవాదులలో జరిగిన పోరాటంలో ఈ మేజర్ అమరుడయ్యారని తెలుస్తోంది .ఆయన జీవిత కథ ఆధారంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: