సాధారణంగా తెలుగు సినీ పరిశ్రమ అనేది, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతున్నట్టు ఆ సీనియర్ హీరోల చుట్టూనే తిరుగుతుంది. దానికి కారణం కూడా అందరికీ తెలిసిందే. ఆయా కుటుంబాల నుండే ఎక్కువ మంది నటులు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఇక ఆ ఫ్యామిలీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ, రెండోది నందమూరి ఫ్యామిలీ, ఇక మూడోది దగ్గుబాటి వారి కుటుంబం. ప్రస్తుతం ఈ మూడు కుటుంబాలకు చెందిన సూపర్ స్టార్లు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ ఒకే వేదిక పైన సందడి చేయడం జరిగింది.

దాంతో ఆ ముగ్గురు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళితే, ప్రతి సంవత్సరం సౌత్ ఇండియన్ సినిమాలకు సంబంధించి ఐఫా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈసారి దుబాయ్ ఐఫా వేడుకలకు వేదిక అయింది. ఈ వేడుక‌ల్లో మెగాస్టార్ చిరంజీవి మరో ప్రతిష్ఠాత్మక అవార్డును కైవసం చేసుకున్నారు. ఐఫా 2024కు గాను ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్‌ ఇండియ‌న్ సినిమా అవార్డును మెగాస్టార్ అందుకున్నారు.

ఇక ఈ అవార్డు మెగాస్టార్ చిరంజీవి అందుకున్న సమయంలో స్టేజి పైకి వెళ్లిన నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ చిరంజీవిని తమ మాటలతో ఆకాశానికి ఎత్తేశారు. దాంతో స్టేడియం అభిమానుల కేరింతలు, చప్పట్లతో దద్దరిల్లిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఈ స్టార్ హీరోల మధ్య ఉన్న రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలు పరంగా వీరి మధ్య చాలా ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. అయితే వీరు ఇలా కలుసుకున్నప్పుడు మాత్రం అన్నిటినీ మర్చిపోయి, పిల్లల్లాగా కలిసిపోయి మాట్లాడుకుంటారు. ఇక ఎవరి ఇంట్లోనైనా ఫంక్షన్ జరిగితే, రచ్చ రచ్చ చేస్తారు. అలాంటి సంఘటనలు మనం ఎన్నో చూశాం. కాగా మరోసారి వీరు ముగ్గురు ఒకే స్టేజి పైన మెరవడంతో అభిమానులు పండగ చేసుకున్నారు. దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన అభిమానాన్ని కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: