మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన నుండి సినిమా వస్తుందంటే, మెగా అభిమానులు వేయికనులతో ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఆయన సినిమాలు లేకపోయినప్పుడు, ఆయన పాత సినిమాలు చూస్తూ టైంపాస్ చేస్తూ ఉంటారు. కాబట్టి రామ్ చరణ్ సినిమాలు గురించి నిద్రలో అడిగిన, వారు ఇట్టే చెప్పేస్తారు. అలాంటి రామ్ చరణ్ సినిమాలోని చెల్లెలుగా నటించిన ఒక నటి ఈరోజు, చాలా అందంగా తయారై హీరోయిన్ కావడం కోసం రేసులో పరిగెడుతుంది అనే విషయం మీకు తెలుసా?

అవును, ఆమె మరెవ్వరో కాదు... అయేషా కాదస్కర్. ఆమె మన చరణ్తో నటించిన సినిమా "గోవిందుడు అందరివాడేలే." ఈ సినిమాలోని అయేషా చరణ్ పక్కన సొంత చెల్లెలు లాగా నటించి మంచి మార్కులే కొట్టేసింది. అప్పటికి ఆమెకి, ఓ 15, 16 సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. కానీ ఇప్పుడు అయోషాని మీరు చూసినట్లయితే గుర్తుపట్టలేరేమో అన్నట్టుగా తయారయింది. 2012లో వచ్చిన బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన అగ్నిపథ్ మూవీలో యాక్ట్ చేసింది అయేషా. ఆతర్వాత 2014లో టాలీవుడ్ లో గోవిందుడు అందరివాడేలే చిత్రంలో కనిపించింది.

ఇక ఆ తరువాత ఆమె తెలుగు చిత్రాలలో పెద్దగా కనబడలేదని చెప్పుకోవాలి. కానీ సోషల్ మీడియాలో మాత్రం అయేషా చాలా చురుగ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు పిచ్చెక్కిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అయోషా పేరు మరలా వినబడుతోంది. అయేషా బాలీవుడ్ సినిమాలలో మాత్రం అడపాదడపా కనబడుతుంది. తాజాగా ఆమె ఆయుష్మాన్ ఖురానా నటించిన డాక్టర్ జీ అనే చిత్రంలో నటించింది. ఈ సందర్భంగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఆమెను గుర్తించిన తెలుగు వారు ఆశ్చర్యపోతున్నారు. చరణ్ పక్కన ఓ పద్ధతిగా కనిపించిన అమ్మాయి ఇంత అందంగా తయారైందేమిటి అని నోళ్ళు యెల్లబెడుతున్నారు!

మరింత సమాచారం తెలుసుకోండి: