ప్రస్తుతం దేవర మానియాతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. రికార్డ్ కలెక్షన్లతో ఎన్టీఆర్ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే తొలి రోజున రూ.140 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టి అదిరిపోయే రికార్డులు సృష్టించాడు. అయితే ఎప్పుడు దేవర ప్రేక్షకుల ముందుకు రావడంతో పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. ఇక పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు షూటింగ్లో జాయిన్ అవ్వబోతున్నాడు. విజయవాడ పరిసరలో వేసిన భారీ సెట్ లో వీరమల్లు షూటింగ్ జరగనుంది. ఈ మేరకు అధికార ప్రకటన కూడా వచ్చేసింది.

వీరమల్లు తర్వాత ఓజి షూటింగ్లో కూడా పవన్ పాల్గొన బోతున్నాడు. కానీ ఇప్పుడు ఈ విషయంపైనే అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. కారణం లేకపోలేదు og కి సంబంధించి బ్యాంకాక్ లో ఒక కీలక ఎపిసోడ్ పవన్ పై తెర్కెక్కించాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ విషయంపైనే అభిమానులు టెన్షన్ పడుతున్నారు. దీంతో ఆ సీక్వెన్స్ కి  కూడా విజయవాడ లోనే సెట్టింగ్ వేస్తున్నారా అనే డౌట్ వాళ్ళల్లో మొదలయ్యింది. పవన్ కెరీర్ లోనే మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీగా ఓజి ని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అలాంటిది ఒరిజినల్ లొకేషన్స్ లో షూట్ చెయ్యకుండా సెట్టింగ్స్ లో చేస్తే రియల్ ఫీల్ ఉండదేమో అని వాళ్ళు భావిస్తున్నారు. ఇక ఇదే విషయంపై చిత్ర యూనిట్ నుంచి అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రభాస్‌తో సాహూని తెరకెక్కించిన సుజిత్ దర్శకుడు కావడంతో ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ఇప్పుడు దేవర విషయంలో ఫుల్ జోష్లో ఉన్న ఎన్టీఆర్ అభిమానుల స్థానంలో పవన్ ఫ్యాన్స్ ఉండాల్సింది.. ముందుగా ఓజీ షూటింగ్ షార్ట్ చేసిన రోజునే సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తామని మేకర్స్‌ అనౌన్స్ చేసారు. కానీ ఇప్పుడు ఆ డేట్ లో దేవర వచ్చి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్‌ ఇచ్చింది. ఇక మరి ఓజీ పవన్ ఫ్యాన్స్ కు ఎలాంటి కిక్కుస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: