జాన్వీ కపూర్ మొదటగా బాలీవుడ్ లో తన కెరియర్ ప్రారంభించింది. అక్కడ కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలా అయినా స్టార్ హీరోయిన్గా రాణించాలని ఎన్నో ఆశలతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అయితే ఎన్నో రోజుల నుంచి కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న జాన్వీ కపూర్ కి తీవ్ర నిరాశ ఎదురయింది. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి దేవర సినిమాలో ఈ బ్యూటీ నటించింది. ఈ సినిమా సెప్టెంబర్ 27న అంటే నిన్న విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.


దేవర సినిమాని రెండు పార్టులుగా తీస్తున్నారు. దేవర వన్ నిన్న రిలీజ్ కాగా, ఇందులో జూనియర్ ఎన్టీఆర్ దీపాత్రాభినయం పోషించారు. జూనియర్ ఎన్టీఆర్ దేవ వర అనే పాత్రలను పోషించారు. ఇందులో ఎన్టీఆర్ ని ప్రేమించే తంగమ్మ క్యారెక్టర్ లో జాన్వీ కపూర్ నటించింది. కానీ జాన్వి కపూర్ పాత్ర నిడివిని డైరెక్టర్ కొరటాల శివ చాలా పరిమితం చేశారు. కొన్ని సీన్లు, ఒక రొమాంటిక్ పాట మాత్రమే జాన్వీ కపూర్ తో సర్దేశారు. జాన్వీ కపూర్ పూర్తిస్థాయి నటనని దేవర పార్ట్ 2లో చూస్తారని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.


ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కెమెరామెన్ రత్నవేలు కూడా అదే విషయాన్ని చెప్పాడు. కానీ దేవర 2 సినిమా రావాలంటే కనీసం రెండు మూడు సంవత్సరాలు అయినా పట్టే అవకాశం ఉంది. వాస్తవంగా జాన్వీ కపూర్ పాత్రను తగ్గించడం వెనక ఎన్టీఆర్ ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అందుతున్న మీడియా వర్గాల సమాచారం ప్రకారం జాన్వీ కపూర్ సీన్స్, పాట ఫైనల్ కట్ లోని చాలా భాగం పోయాయట. దాదాపు 7 నిమిషాల వరకు జాన్వి కపూర్ పాత్రను కట్ చేశారట. దావుది పాటను కూడా తీసేశారు. ఆ పాటను సినిమా చివర్లో ఎండ్ టైటిల్స్ యాడ్ చేద్దామనేది కొరటాల శివ ఆలోచన ఉండేదట.


అయితే దీనికి ఎన్టీఆర్ ఒప్పుకోలేదట. ఫైనల్ కట్ లో కూర్చున్న ఎన్టీఆర్ సెకండ్ హాఫ్ లో రొమాన్స్ సినిమా రన్ కు అడ్డం వస్తుందని లాగ్ గా భావించి ట్రిమ్ చేయించారట. ఎన్టీఆర్ సలహాలు, సూచనల మేరకే ఇలా జరిగింది కాబట్టి నో కామెంట్స్ అంటున్నారట. జాన్వి కపూర్ పాత్ర చాలా తక్కువగా ఉండడానికి ఎన్టీఆరే ముఖ్య కారణం అని ఇండస్ట్రీవర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: