జానీ మాస్టర్ కేసు టాలీవుడ్ లో పెద్ద సంచలనం సృష్టించిన సంగతి మనకు తెలిసిందే.ఆయన తన దగ్గర పని చేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ని మైనర్ గా ఉన్న సమయంలోనే పలుమార్లు అత్యాచారం చేశారని,ఆ తర్వాత ఆమెతో లైంగిక కోరికలు తీర్చుకుంటూ మతం మార్చుకొని రెండో పెళ్లి చేసుకోమని టార్చర్ చేస్తున్నారని బాధిత మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దాంతో జానీ మాస్టర్ పేరు ఒక్కసారిగా మీడియాలో వైరల్ అయింది. ఇక జానీ మాస్టర్ పారిపోగా ఆయన్ని పోలీసులు పట్టుకొని కోర్టులో ప్రవేశపెట్టి ఆ తర్వాత నార్సింగి పోలీసులు నాలుగు రోజుల కస్టడీలో తీసుకొని ఈ విషయంలో విచారించారు. ఇక ఈ కస్టడీలో జానీ మాస్టర్ ఆ అమ్మాయే తనను పెళ్లి చేసుకోమని వేధించింది అని మైనర్ గా ఉన్న సమయంలో నేను అత్యాచారం చేశాను అని చెప్పిన దాంట్లో ఎలాంటి నిజం లేదు అని పోలీసుల విచారణలో తెలియజేశారట. అయితే పోలీసులు అడిగినా కొన్ని ప్రశ్నలకు కూడా జానీ మాస్టర్ సమాధానం దాటవేశారని తెలుస్తోంది.

 అయితే కస్టడీ పూర్తయ్యాక రంగారెడ్డి జిల్లా కోర్టులో జానీ మాస్టర్ ని ప్రవేశపెట్టారు.అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఎదురైంది. అయితే జానీ మాస్టర్ కి బెయిల్ వస్తుంది అనుకున్న సమయంలో తాజాగా జానీ మాస్టర్ భార్య ఫిలిం ఛాంబర్ కామర్స్ లో ఫిర్యాదు చేసింది. ఇక ఈ ఫిర్యాదులో ఐదు సంవత్సరాలుగా ఆ అమ్మాయి మాకు నరకం చూపిస్తుందని, ఆ అమ్మాయి నా భర్తతో రిలేషన్ పెట్టుకొని ఆయన్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బు బంగారం తీసుకుందని, అన్న వదిన అని పిలుస్తూ మోసం చేసిందని,ఆ అమ్మాయి వల్ల నేను ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాను అంటూ సంచలన స్టేట్మెంట్ ఇచ్చింది.

అయితే ఇన్ని రోజులుగా ఆ అమ్మాయి కేవలం అసిస్టెంట్ గా మాత్రమే జానీ మాస్టర్ దగ్గర ఉంది అని ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో ఇలాంటి నిజం లేదు అని చెప్పిన జానీ మాస్టర్,ఆయన భార్య సడన్గా రూట్ మార్చిఅమ్మాయి నా భర్తని ట్రాప్ చేసి వలలో వేసుకోవాలని చూసింది, రిలేషన్ పెట్టుకుంది అంటూ జానీ మాస్టర్ భార్య ఫిలిం ఛాంబర్ కామర్స్ ఫిర్యాదు లెటర్ లో రాయడంతో ప్రస్తుతం ఈ కేసు మరో మలుపు తిరిగింది.దీంతో పోలీసులు మళ్ళీ జానీ మాస్టర్ ని విచారించి ఆ అమ్మాయితో రిలేషన్ లో ఉంటే ఎక్కడెక్కడ తిరిగారు. బలవంతంగా ఆమెను అత్యాచారం చేశారా.. అనే కోణంలో మళ్లీ విచారించడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. అలా బెయిల్ వస్తుంది అనుకున్న సమయంలో జానీ మాస్టర్ భార్య చేసిన పనికి బెయిల్ ఆగిపోయిందని తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: