చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. స్టార్‌డం ఎవరికి శాశ్వతం కాదు. నటిస్తేనే సంపాదన లేకుంటే రూపాయి కూడా ఉండదు. అందుకే ఒకప్పటి సీనియర్ స్టార్ హీరో శోభనబాబు తన సంపాదించిన సంపాదన అంతా జాగ్రత్తగా దాన్ని పెట్టుబడిగా మార్చుకునే వారట. ముఖ్యంగా భూమికి ప్రత్యామ్నాయం లేదు కాబట్టి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడితే ఎప్పటికైనా లాభాలు వస్తాయని ఆయన భావించే వారట.

అందుకే ఆ రోజుల్లోనే మద్రాస్ పరిసర ప్రాంతాల్లో ఆయన ఎన్నో ఎకరాల భూములను కొనుగోలు చేశారట. ఒకప్పుడు ఎలాంటి విలువ లేని ఆ భూములు ఇప్పుడు కోట్ల రూపాయలు పలుకుతున్నాయి. అలాగే తన తోటి నటులకు కూడా ఈ విషయాలలో శోభన్ బాబు సలహాలు ఇచ్చేవారట. కాగా సీనియర్ హీరోయిన్ జయసుధకు కూడా శోభన్ బాబు విలువైన సలహా ఇవ్వగ ఆమె వినలేదట . దాని వలన ఆమె ఎప్పుడూ భారీ మూల్యం చెల్లించుకుంది.

ఒకరోజు షూటింగ్ కోసం కారులో శోభన్ బాబు, జయసుధ వెళ్తున్నారట. అప్పుడు శోభన్ బాబు.. జయసుధతో ఇలా అన్నారట నీకు ఒక స్థలం చూపిస్తాను. మీ ఇంట్లో చెప్పి దాన్ని కొనుక్కో అన్నారట. ఇక దాంతో జయసుధ ఆమె భర్తతో పాటు ఆ ప్లేస్ కి వెళ్లి చూస్తే అది ఒక డంపింగ్ యార్డ్ ల ఉందట. దాన్ని చూసి శోభన్ బాబుకు ఏమైనా పిచ్చా అంత డబ్బు పెట్టి ఇలాంటి చెత్తకుప్ప దగ్గర స్థలం కొనుక్కోమంటాడు ఏంటి అని జయసుధ షాక్ అయిందట.

అసలు ఇలాంటి స్థలం కొనుక్కోమంటారు ఏంటి అని శోభ‌న్ బాబుతో అన్నారట. లేదు నా మాట విని ఈ స్థలం కొనుక్కో ఇదంతా పూడ్చి కమర్షియల్ ఏరియా చేయబోతున్నారని శోభన్ బాబు అన్నారట. ఏదేమైనా డంపింగ్ యార్డ్ ద‌గ్గ‌ర నాకు కోన‌డం ఇష్టం లేక‌ జయసుధ శోభన్ బాబు సలహాను పట్టించుకోలేదు. అయితే కొన్ని సంవత్సరాలకు అది సిటీగా మారిపోయింది. చెన్నైలోనే అత్యంత డిమాండ్ ఉన్న అన్నానగర్ గా అది మారిందని జయసుధ ఓఇంటర్వ్యూలో చెప్పకు వచ్చారు. అక్కడ ఎకరం కనీసం 100 కోట్లు ఉంటుందని ఆమె ఆ ఇంటర్వ్యూలో అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: