నాగ్ అశ్విన్... ఇప్పుడు ఈ పేరు తెలియని జనాలు ఉండరని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. మహానటి అనే సినిమా వలన నాజ్ అశ్విన్ తెలుగు నాట ఎంత పాపులర్ అయ్యాడో, కల్కి అనే సినిమా ద్వారా భారతీయ సినిమా ప్రేక్షకులకు మరోసారి టాలీవుడ్ సత్తా తెలిసేలా చేయడంలో ప్రధాన పాత్ర వహించాడు నాగ్ అశ్విన్. దాంతో ఇప్పుడు బాలీవుడ్ కాన్స్ సైతం నాగ అశ్విన్ వైపే చూస్తున్న పరిస్థితి ఏర్పడింది.

ఈయన దర్శకత్వంలో, ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమా రికార్డుల గురించి ఇక్కడ ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. దాదాపు 300 కోట్ల రూపాయలతో నిర్మితమైన ఈ సినిమా, ప్రపంచ వ్యాప్తంగా 1600 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటి చెప్పింది.

ఈ నేపథ్యంలోనే కల్కి సెకండ్ పార్ట్ శరవేగంగా షూటింగు జరుపుకుంటుంది. ఇక సెకండ్ పార్ట్ కూడా రికార్డ్ స్థాయి వసూళ్లను రాబట్టబోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వం వహిస్తున్న రాజా సాబ్ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాతో పాటుగా కల్కి సెకండ్ పార్ట్ షూటింగులో కూడా జాయిన్ అవుతున్నాడు. ఇక కల్కి సినిమాటిక్ యూనివర్స్ ద్వారా పాపులర్ అయిన నాగ్ అశ్విన్ తరువాత చేయబోయే సినిమా గురించి ఇప్పుడు చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ సినిమా హీరో పేరు బాగా వినబడుతుంది. కల్కి పూర్తయిన తర్వాత నాగి ఆ హీరో తోనే సినిమా చేయబోతున్నాడు అని గుసగుసలు వినబడుతున్నాయి. ఆయన మరెవరో కాదు, తెలుగు ప్రేక్షకుల హృదయ చోరుడు మెగాస్టార్ చిరంజీవి. అవును, నాగ్ మెగాస్టార్ చిరంజీవిని కలిసి, తాజాగా ఓ కథ చెప్పడం, మెగా స్టార్ ఓకే చేయడం ఒకే సారి జరిగిపోయాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: