బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఐశ్వర్య రాయ్ ఇటీవల హాజరు అవుతున్న ప్రతి పబ్లిక్ ఈవెంట్‌ లలో, పార్టీలలో, అవార్డ్‌ వేడుకల్లో తన కూతురు ఆరాధ్య తో కలిసి కనిపిస్తున్న విషయం తెల్సిందే. ఆరాధ్య మొన్నటి వరకు చిన్న పాపగా అనిపించింది. కానీ ఇప్పుడు పెద్ద అమ్మాయిగా మారింది. త్వరలోనే ఆరాధ్య హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందా అన్నట్లుగా ఆమె కనిపిస్తుంది. అంతే కాకుండా తల్లి చాటు పిల్లలా కాకుండా ప్రత్యేకంగా ఆరాధ్య కనిపిస్తూ మీడియా అటెన్షన్‌ ను దక్కించుకుంటుంది. తాజాగా ఐఫా వేడుకల్లోనూ ఐశ్వర్య రాయ్ తన కూతురు ఆరాధ్య తో పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఓ విలేకరి ఆరాధ్య మీతోనే ఉంటూ ఎన్నో విషయాలు నేర్చుకుంటుంది అని ఏదో అడుగుతుండగా.. ఐశ్వర్య అసహనం వ్యక్తం చేస్తూ.. ‘‘తను నా కూతురు. ఎప్పుడు నాతోనే ఉంటుంది’’ అని రియాక్ట్ అయి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.


ప్రజెంట్ ఐశ్వర్య కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆమె అభిషేక్ బచ్చన్‌తో విడాకులు తీసుకోబోతున్నట్లు ఈ కామెంట్స్‌తో క్లారిటీ ఇచ్చిందని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని ఆమె అభిమానులు వాధిస్తున్నారు. కాగా, ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆరాధ్య అనే కూతురు కూడా ఉంది. అయితే ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొద్ది కాలంగా పలు వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కానీ వీరిద్దరూ వాటిపై అధికారికంగా స్పందించలేదు.

కానీ రీసెంట్గా తమ కూతురు ఆర్యాదతో కలిసి వెకేషన్ కు వెళ్లినట్లు ఓ వీడియో వైరల్ కావడంతో విడాకుల వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. అలాగే ప్యారిస్ ఫ్యాషన్ వీక్ వేదికగా భర్త అభిషేక్ తో కలిసి వేదికను పంచుకోవడంతో విడాకులకు చెక్ పడినట్లు అయింది. కానీ నిత్యం వీరి విడాకులకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఈ క్రమంలోని ఐశ్వర్య తన కూతురు తనతోనే  ఉంటుందని కామెంట్ చేయడం ఎప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: