బాలీవుడ్ లో విడుదలైన సిరీస్లో మంచి విజయాలను అందుకున్న చిత్రాలు ధూమ్ సిరీస్.. దాదాపుగా 20 ఏళ్ల క్రితం విడుదలైన ధూమ్ సినిమాలో బాలీవుడ్ హీరోలు కూడ విలన్ గా నటించవచ్చా అనే విధంగా మారిపోయింది. ధూమ్ సిరీస్ లో భాగంగా జాన్ అబ్రహం, హృతిక్ రోషన్ ,అమీర్ ఖాన్ వంటి వారు కూడా విలన్ గా నటించడం జరిగింది. ఇప్పుడు ధూమ్-4 చిత్రానికి సంబంధించి పలు రకాల చర్చలు జరుగుతున్నట్లు బాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. మొదట ఈ చిత్రంలో హీరో సూర్య విలన్ గా నటించబోతున్నట్లు గుసగుసలు వినిపించాయి. కానీ ఇప్పుడు తాజాగా అవన్నీ కేవలం రూమర్స్ గాని మిగిలిపోయాయి అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.


ధూమ్-4 కోసం బాలీవుడ్ ప్రముఖు నటుడిని ఎంపిక చేయబోతున్నట్లు సమాచారం. ఆ హీరో ఎవరో కాదు రణబీర్ కపూర్.. ధూమ్-4 లో విలన్ గా కనిపించబోతున్నట్లు సమాచారం.
అందుకు సంబంధించి  డైరెక్టర్ ఆదిత్య చోప్రా ఎంపిక చేసినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో రణబీర్ కపూర్ ఒక సైబర్ దొంగగా కూడా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథకు సంబంధించి గత కొన్ని నెలలుగా చర్చలు అయితే శరవేగంగా జరుగుతున్నాయట. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.


ప్రస్తుతం రణబీర్ కపూర్ రామాయణం అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే బ్రహ్మాస్త్ర-2 లో కూడా కనిపించబోతున్నారట. ఆ వెంటనే బన్సాలి అనే ఒక కొత్త చిత్రంలో నటించబోతున్నారు. ఈ చిత్రం అయిపోయిన వెంటనే ధూమ్-4 లో నటించబోతున్నారు.. గతంలో కూడా స్టార్ హీరోలుగా పేరుపొందిన జాన్ అబ్రహం, హృతిక్ రోషన్ ,అమీర్ ఖాన్ వంటి వారందరూ కూడా ధూమ్ సిరీస్లో దొంగలు గానే నటించి అదరగొట్టేశారు. వీరందరూ కూడా సరికొత్త ఫ్రెండ్ కి నాంది పలికారు.ఇప్పటివరకు ధూమ్ సిరీస్ అన్ని మంచి విజయాలను అందుకుంది.. మరి రణబీర్ కపూర్ ఏ మేరకు ధూమ్-4 లో మేప్పిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: