మ్యాడ్, ఆయ్ చిత్రాలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న యంగ్ ప్రామిసింగ్ హీరో నార్నే నితిన్, శతమానం భవతి సినిమాతో టాలివుడ్ కు నేషనల్ అవార్డు అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ సతీశ్ వేగేశ్న, శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై గుర్తుందా శీతాకాలం వంటి సక్సెస్ ఫుల్ సినిమా చేసిన ప్యాషనేట్ ప్రొడ్యూసర్ చింతపల్లి రామారావు బ్లాక్ బస్టర్ కాంబోలో వస్తున్న క్రేజీ మూవీ  శ్రీశ్రీశ్రీ రాజావారు.


లవ్ ఫ్యామీలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో సంపద హీరోయిన్ గా నటిస్తోంది. దసరా పండుగకు శ్రీశ్రీశ్రీ రాజావారు సినిమా గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ ను ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. శ్రీశ్రీశ్రీ రాజావారు టీజర్ చూశాను. చాలా బాగుంది. ప్రేమకు ఎలక్షన్ తో పోలుస్తూ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. దర్శకుడు సతీశ్ వేగేశ్న గారు గతంలో శతమానం భవతి సినిమాతో నేషనల్ అవార్డు గెలుచుకున్నారు. ఈ సినిమా టీజర్ చూస్తే ఆయన ప్లేవర్ లోనే ఈ సినిమా ఉంటుంది అని తెలుస్తోంది. మంచి లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రమిది. నార్నే నితిన్ నాకు ఎన్టీఆర్ గారి మ్యారేజ్ టైం నుంచి తెలుసు.


మ్యాడ్, ఆయ్ సినిమాలతో ప్రామిసింగ్ హీరోగా ఎదుగుతున్నారు. ఆయనకు శ్రీశ్రీశ్రీ రాజావారు మరో బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తుందని నమ్ముతున్నాను. నార్నే నితిన్ ను మాసీగా ప్రెజెంట్ చేశారు సతీశ్ వేగశ్న గారు. రామారావు గారు ఎప్పటి నుంచో ఈ మూవీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆయనకు ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. ప్రొడ్యూసర్ రామారావు గారికి కూడా నా బెస్ట్ విషెశ్ చెబుతున్నా. రావు రమేశ్ గారు, నరేశ్ లాంటి మంచి యాక్టర్స్‌ ఈ చిత్రంలో నటించారు. దసరా పండుగకు ఫ్యామిలీ అంతా కలిసి చూసూఏ ఫర్ఫెక్ట్ మూవీ ఇది అని అన్నారు.



నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ.. ఈ రోజు శ్రీశ్రీశ్రీ రాజావారు సినిమా టీజర్ ను నేషనల్ అవార్డు విన్నర్, స్టార్ డైరెక్టర్ వంశీ చేతులు మీదుగా రిలీజ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. ఆయనకు మా టీమ్ కు తన బెస్ట్ విషెష్ అందించినందుకు థ్యాంక్స్ చెబుతున్నాం. మ్యాడ్, ఆయ్ సినిమాల తర్వాత యంగ్ టాలెంటెడ్ హీరో నార్నే నితిన్ కు మా శ్రీశ్రీశ్రీ రాజావారు సినిమా హ్యాట్రిక్ హిట్ కాబోతుంది. శతమానం భవతి సినిమాలో నేషనల్ అవార్డు గెలుచుకున్న దర్శకుడు  సతీశ్ వేగ్నేశ గారు మరోసారి మంచి లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రాన్ని రూపొందించారు. శ్రీశ్రీశ్రీ రాజావారు సినిమాను హైబడ్జెట్ తో క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. దసరాకు మా మూవీని థయేటర్స్ లోకి తీసుకొస్తున్నాం. ఈ దసరా సంబురాలను రెట్టింపు చేసే చిత్రమిది. మీరంతా దసరా పండుగను మా శ్రీశ్రీశ్రీ రాజావారు సినిమాతో సెలబ్రేట్ చేసుకుంటారని కోరుకుంటున్నాం అన్నారు.


నటీనటులు: నార్నే నితిన్, సంపద, రావు రమేశ్, నరేశ్, రఘు కుంచె, ప్రవీణ్, రచ్చ రవి, సరయు, రమ్య, ప్రియ, మాచిరాజు, భద్రం, ఆనంద్, జబర్దస్త్ నాగి, తదితరులు.

మరింత సమాచారం తెలుసుకోండి: