నందమూరి బాలకృష్ణ మీడియా ముందుకు వచ్చారంటే చాలు దడ దడ లాడిస్తారు. ఆయన మాటలు బుల్లెట్ల లాగా పేలుతాయి. అంతే కాదు కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయడంలో కూడా ఆయన ముందుంటారు. ఆయన ఏం మాట్లాడినా ధైర్యంగా మాట్లాడతారు. పైకి ఒకటి, లోపల ఒకటి అనుకునే వ్యక్తిత్వం ఆయనది కాదు. లోపల ఏముంటే అది ధైర్యంగా బయటికి చెప్పేస్తారు, ఏమాత్రం ఆలోచించరు. ఆయన తీరే అంత. తాజాగా మరోసారి అతని ముక్కుసూటితనం బయటపడింది. అదే సమయంలో అతని కాంట్రవర్షియల్ కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

ఈసారి ఎన్టీఆర్ వారసత్వం, వారసుల గురించి మీడియా పర్సన్స్ బాలకృష్ణను ప్రశ్నించారు. ఓ ప్రశ్న వినగానే బాలకృష్ణ ఏ మాత్రం ఆలోచించకుండా ఓ ఆన్సర్ ఇచ్చారు. అది తారక్ ఫ్యాన్స్‌కు మింగుడు పడటం లేదు. చాలా మంది బాలయ్య నిజస్వరూపం ఇదే అని ఆగ్రహంగా కామెంట్లు చేస్తున్నారు. అసలు ఏ సందర్భంగా బాలకృష్ణ తారక్ కి వ్యతిరేకంగా కామెంట్లు చేశారు తెలుసుకుందాం.

రీసెంట్‌గా అబుదాబి వేదికగా ఐఫా అవార్డుల ఉత్సవం జరిగింది. ఇందులో బాలయ్యకు గోల్డెన్ లెగసీ అవార్డు లభించింది. ఆ అవార్డును స్వీకరించేందుకు బాలకృష్ణ స్టేజ్ మీదకు వెళ్లి చాలా సందడి చేశారు. అవార్డ్‌ తీసుకున్న తర్వాత రెడ్‌ కార్పెట్‌ పై బాలకృష్ణ మాట్లాడటం జరిగింది. గోల్డెన్ లెగసీ అవార్డు తనకు దక్కడం ఎంతో హ్యాపీగా ఉందని అన్నారు. మరో 25 ఏళ్లు హీరోగానే సినిమాలు చేస్తానని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా మోక్షజ్ఞ కి సైతం పోటీగా తాను సినిమాలు తీస్తానని సరదాగా అన్నారు.

సీనియర్ ఎన్టీఆర్ వారసులు బాలకృష్ణ.. మరి బాలకృష్ణ వారసులు ఎవరు? అని ఒక మీడియా పర్సన్ క్వశ్చన్ చేశారు. దానికి బాలకృష్ణ ఆలోచించకుండా "నా కొడుకు, నా మనవడు మాత్రమే నా వారసులు" అని చాలా గర్వంగా చెప్పారు. వ్యాఖ్యలను పలువురు పలు రకాలుగా అర్థం చేసుకుంటున్నారు. వీరిద్దరు మాత్రమే బాలకృష్ణ వారసులైతే మరి జూ. ఎన్టీఆర్‌ బాలయ్య, నందమూరి ఫ్యామిలీ వారసుడు కాదా? ఇన్‌డైరెక్ట్‌ గా తారక్ ఎవరో నాకేం తెలుసు అన్నట్లు బాలకృష్ణ రిప్లై ఇచ్చారా? అని కొందరు  తమ సందేహాలను బయటపెడుతున్నారు. మరి కొంతమంది మాత్రం ఈ విషయంలో నెగిటివ్ గా ఆలోచించాల్సిన అవసరం లేదు అని అభిప్రాయాలు అర్థం చేస్తున్నారు. ఏది ఏమైనా బాలకృష్ణ చేసిన కామెంట్స్ ప్రస్తుతం స్వల్ప వివాదానికి దారి తీసాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: