టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చాలు అనేక సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. ఆ సమయంలో ప్రేక్షకులు ఎక్కువ శాతం సినిమాలు చూడడానికి ఆసక్తిని చూపిస్తూ ఉండడం వల్ల కాస్త యావరేజ్ టాక్ వచ్చిన సినిమాలకు కూడా పెద్ద ఎత్తున కలెక్షన్లు వస్తూ ఉంటాయి. దానితో నిర్మాతలు , దర్శకులు , హీరోలు అంతా కూడా ఎక్కువ శాతం తమ సినిమాలను సంక్రాంతి పండుగకు విడుదల చేయాలి అనుకుంటారు. దానితో సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చాలు అనేక మంది హీరోల సినిమాలు విడుదల కావడం జరుగుతూ ఉంటుంది.

ఇక వచ్చే సంవత్సరం సంక్రాంతి పండగకి కూడా టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర ఇలాంటి వాతావరణమే కనబడే అవకాశం ఉంది. ఏకంగా ఐదు సినిమాలు ఈ సంవత్సరం సంక్రాంతి బరిలో నిలబడి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఓ మూడు సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా వెలుబడ్డాయి. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఎప్పుడో ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ లో నటిస్తున్నాడు. ఈ మూవీ ని కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి కి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక తమిళ నటుడు అజిత్ తెలుగు నిర్మాణ సంస్థ అయినటువంటి మైత్రి సంస్థ లో గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ ని సంక్రాంతి కి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక బాలయ్య హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను , అలాగే నాగ చైతన్య హీరోగా రూపొందుతున్న తండెల్ మూవీ లను కూడా సంక్రాంతి బరిలో నిలిపే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా సంక్రాంతి కి విడుదల అయితే వచ్చే సంక్రాంతి కి బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద వారు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు అధికారిక ప్రకటనలు వచ్చిన వాటిలో చిరంజీవి హీరోగా రూపొందుతున్న విశ్వంభర , వెంకటేష్ హీరోగా రూపొందుతున్న సినిమాలపై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: