యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర పార్ట్ 1 మూవీ సెప్టెంబర్ 27 వ తేదీన భారీ అంచనాలు నడుమ ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి కొరటాల శివ దర్శకత్వం వహించగా ... ఈ మూవీ లో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీతోనే ఈమె తెలుగు తెరకు పరిచయం అయింది.

ఈ సినిమాలో హిందీ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో నటించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మిక్స్ డ్ టాక్ వచ్చిన కూడా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు భారీ కలక్షన్లు వచ్చాయి. ఇక ఈ మూవీ కి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్లు దక్కుతున్నాయి. కానీ తమిళనాడు రాష్ట్రంలో మాత్రం ఈ సినిమాకు భారీ కలెక్షన్లు రావడం కష్టంగా కనబడుతుంది. ఎందుకు అంటే అసలే ఈ సినిమాకు కాస్త మిక్స్ డ్ టాక్ వచ్చింది.  అందులో కార్తీ , అరవింద స్వామి ప్రధాన పాత్రలో రూపొందిన సత్యం సుందరం అనే తమిళ సినిమా సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల అయ్యి మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది.

దానితో తమిళ ప్రేక్షకులు ఎక్కువ శాతం ఈ సినిమాపై ఆసక్తి చూపించే ప్రభావం ఉంది. దానితో దేవర కలెక్షన్లు తమిళ నాడు రాష్ట్రంలో చాలా వరకు తగ్గే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి సత్యం సుందరం సినిమాను బీట్ చేసి తమిళనాడు రాష్ట్రంలో దేవర పార్ట్ 1 సినిమా కలక్షన్లను రాబడుతుందేమో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: