తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ పూనమ్ కౌర్ సినిమాలలో కంటే వివాదాలలోనే తరచు ఎక్కువగా ఉండటం వల్ల ఈమె పేరు బాగా పాపులారిటీ అయింది.. వాస్తవానికి పంజాబీ ఇండస్ట్రీ నుంచి ఎంట్రీ ఇచ్చిన ఈమె తెలుగులో పంజాబీలో అడపా దడపా సినిమాలలో నటించింది. నిరంతరం టాప్ డైరెక్టర్ పైన ఏవో ఒక పోస్టులు షేర్ చేస్తూ రాజకీయ అంశాలకు పై కూడా తెరలేపేలా చేస్తూ ఉంటుంది పూనమ్ కౌర్.. అప్పుడప్పుడు పలు రకాల కాంట్రవర్సీలకు కూడా చోటు ఇస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా త్రివిక్రమ్ తో పాటు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.


ఈ మధ్యకాలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే డైరెక్టర్ త్రివిక్రమ్ ను కూడా ఇన్ డైరెక్ట్ గానే టార్గెట్ చేస్తూ పలు రకాల ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది పూనమ్. అయితే వీరి ముగ్గురు మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ గత పదేళ్ల నుంచి వీరి మధ్య ఏదో ఒక రహస్యం మాత్రం దాగి ఉందని విషయం అప్పుడప్పుడు అనిపిస్తూ  ఉంటుంది అభిమానులకు. తాజాగా పూనమ్ కౌర్ తన పోస్టులో పవన్ కళ్యాణ్ పేరు చెప్పకుండానే.. ఒక పార్టీ వ్యవస్థాపకుడు సినీ నటుడైన ఒక వ్యక్తి  రాజకీయాల లబ్ధి కోసం హిందువుల సెంటిమెంటును ఉపయోగించుకుంటున్నారు అంటూ ఆరోపిస్తోంది.


అలాగే ఎవరైతే సనాతన ధర్మ యోధుడిగా ఉన్న తను సనాతన క్రైస్తవంలోకి మార్చుకుంటారు.. వారి యొక్క కపటత్వం చూసి నాకు చాలా అసహ్యంగా అనిపిస్తోంది ..ఇది అంతా వంచన అంటూ పోస్ట్ షేర్ చేసింది.. దేవుడు అన్ని విషయాలు కూడా చూస్తూ ఉంటాడు అంటూ పూనమ్ కౌర్ తెలియజేసింది. ఈ విషయం పై  కొంతమంది నెటిజన్స్  పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించే పూనమ్ ఇలా ట్విట్ చేసిందేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ హిందూ ధర్మాన్ని పాటిస్తున్నానని హిందూ ధర్మాన్ని అపహాస్యం చేసేలా ఎవరు చూడకూడదని కూడా ఇటీవలే తెలియజేశారు. వీరి పైన ఇప్పటికే ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్. మరి పూనమ్ కౌర్ కు ఏ విధంగా కౌంటర్ వేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: