హీరోయిన్ కుష్బూ అంటే తెలియని వారు ఉండరు..ఈమె కేవలం సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా రాణి అనిపించుకుంది. అలా బీజేపీలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ అవకాశాలు వస్తే సినిమాల్లో కూడా కీలకపాత్రల్లో నటించడానికి ఒప్పుకుంటుంది.అయితే అలాంటి కుష్బూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వెంకటేష్ సినిమాలో తనకి ఒక చేదు అనుభవం ఎదురైందని,తన ప్రైవేట్ పార్ట్ పై అసభ్యంగా టచ్ చేసారు అంటూ సంచలన కామెంట్స్ చేసింది.మరి ఇంతకీ కుష్బూ ప్రైవేట్ పార్ట్ పై అసభ్యంగా టచ్ చేసింది ఎవరు? ఆరోజు వెంకటేష్ చేసిన పనికి ఎందుకు అందరూ షాక్ అయ్యారు అనే సంచలన విషయం ఇప్పుడు తెలుసుకుందాం. రామానాయుడు కొడుకుగా ఇండస్ట్రీలోకి కలియుగ పాండవులు మూవీతో  వెంకటేష్ హీరో గా ఎంట్రీ ఇచ్చారు.ఇక ఈ మూవీలో హీరోయిన్ గా కుష్బూ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఉన్న కుష్బూకి ఇప్పటి కుష్బూకి చాలా తేడాలు ఉంటాయి. అప్పట్లో ఎంతో సన్నగా ఉండే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బొద్దుగుమ్మగా మారిపోయింది.

అయితే ఈ సినిమా చేసే సమయంలో అవుట్ డోర్ షూటింగ్ కోసం తమిళనాడులోని ఓ ప్రాంతానికి వెళ్లారట చిత్ర యూనిట్. ఇక అక్కడికి వెళ్లాక చిత్ర యూనిట్ అందరికీ గవర్నమెంట్ క్వార్టర్స్ లో ఉండమని చెప్పారట. ఇక అక్కడికి వెళ్ళిన సమయంలో ఓ వ్యక్తి వెనుక నుండి వచ్చి కుష్బూ బ్యాక్ ని అసభ్యంగా టచ్ చేశారట. దాంతో వెంటనే వెనక్కి తిరిగి కుష్బూ ఆయనకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిందట. ఇక అవమానం తట్టుకోలేని ఆ వ్యక్తి ఊరందరిని పిలిచి గోల గోల చేశారట.దాంతో చిత్ర యూనిట్ మొత్తం కుష్బూకి అండగా నిలబడ్డారట. మా ఊరికి వచ్చి మా ఊరి అబ్బాయినే కొడతావా అంటూ కుష్బూని భయభ్రాంతులకు గురి చేశారట.

 కానీ ఆ టైమ్ లో సురేష్ బాబు,వెంకటేష్ ఇద్దరు ఆ ఊరివారి ముందుకు వెళ్లి మీ ఇంటి అమ్మాయిపై ఇలా చేయి వేస్తే మీరు ఊరుకుంటారా అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారట. దాంతో ఆ వ్యక్తి కుష్బూకి సారీ చెప్పి అక్కడినుండి వెళ్లిపోయారట. ఇక ఆరోజు వెంకటేష్,సురేష్ బాబు చేసిన పనికి చిత్ర యూనిట్ షాక్ అయ్యారట. కుష్బూ మాత్రం హెల్ప్ చేసి తనకి అండగా నిలబడినందుకు చిత్ర యూనిట్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసిందట.అయితే ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో కుష్బూ తెలియజేసింది

మరింత సమాచారం తెలుసుకోండి: