టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ కలిగిన దర్శకులలో కొరటాల శివ ఒకరు. ఈయన ఇప్పటివరకు చాలా సినిమాలకు దర్శకత్వం వహించాడు. మొదటగా కథ రచయిత గా పని చేసి గుర్తింపును సంపాదించుకున్న ఈయన మిర్చి మూవీ తో దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించాడు. ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించాడు. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీమంతుడు., ఆ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జనతా గ్యారేజ్ , ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా భరత్ అనే నేను , ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య మూవీ ని తెరకెక్కించాడు.

ఆచార్య సినిమాలో చిరంజీవి తో పాటు రామ్ చరణ్ కూడా ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఇక తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దేవర పార్ట్ 1 మూవీ ని కొరటాల తెరకెక్కించాడు. ఇకపోతే ఒకానొక ఇంటర్వ్యూలో భాగంగా కొరటాల కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మీరు సినిమా చేయరా అనే ప్రశ్న ఎదురయింది. దానికి ఆయన సమాధానం చెబుతూ పవన్ కళ్యాణ్ ఓ గొప్ప స్టార్ హీరో. ఆయనతో సినిమా చేయాలి అని ఏ దర్శకుడికి ఉండదు. నాకు కూడా ఉంది. కానీ కొన్ని సార్లు అనుకున్నాను... కానీ సెట్ కాలేదు.

ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నాడు. ఆయన ఇప్పటికే మూడు సినిమాలను ఒప్పుకొని ఉన్నాడు. ఆ తర్వాత సినిమాలో చేస్తాడో లేదో కూడా పెద్దగా తెలియదు. ఒక వేళ ఆయన సినిమాలు చేస్తే కనుక కచ్చితంగా ఆయనతో మూవీ చేస్తాను అని కొరటాల చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: