నటసింహ బాలకృష్ణ ఎంత పెద్ద హీరో అయినా కూడా ఎవరైనా సహాయం అని అడిగిన ఎంతో గొప్ప మనసుతో చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ఉంటారు బాలయ్య ముఖ్యంగా బసవతారకం అనే హాస్పిటల్ ద్వారా చాలామంది చాలా తక్కువ ఖర్చుతోనే వైద్యం అందించిన ఘనత కూడా ఉన్నది.. అలాగే ఎమ్మెల్యేగా తన నియోజవర్గం ప్రజలకు కూడా ఎలాంటి కష్టాలను రాకుండా చూస్తూ ఉంటారు బాలయ్య. ఈయన అభిమానులు కూడా ఆయన బాటలోనే ఇప్పుడు నడుస్తూ సేవాగుణంలో మునిగిపోయారు.


బాలయ్య పుట్టినరోజు లేకపోతే ప్రత్యేకమైన రోజున అన్నదానాలు, రక్తదానం వంటివి చేస్తూ ఉంటారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు తాజాగా ఆర్థిక సహాయం చేసినట్టుగా బాలయ్య అభిమానులు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి అందరూ కూడా బాలయ్య అభిమానులను ప్రశంసిస్తూ ఉన్నారు. ఒక పసిపాప ప్రాణాన్ని కాపాడేందుకు సైతం బాలయ్య అభిమానులు ఒక అడుగు ముందుకు వేశారు క్యాన్సర్ బారిన పడిన ఒక చిన్నారిని సైతం కాపాడేందుకు తమ వంతు సహాయంగా ఆర్థిక సహాయాన్ని అందించారు. మునగోడు మండలం కొరటికల్ గ్రామానికి చెందినటువంటి ఆరుషి అనే ఒక 20 నెలల పాప వెన్నులో కనిత సమస్యలతో ఇబ్బంది పడుతోందట.


ఏప్రిల్ 27న మెడికల్ సర్జరీ చేసి తొలగించారు.. మరొకసారి ఇలా రాకుండా ఉండేందుకు కియోథెరపీ చేయించాలని వైద్యులు ఆ పాప తల్లితండ్రులకు తెలియజేశారట.. అయితే ఉన్నదంతా ఇచ్చినా కూడా డబ్బులు తక్కువగా రావడం జరిగిందట. ఇప్పటికే ఎనిమిది లక్షల రూపాయలు పైగా ఖర్చు అయిందని.. పాప ఒప్పో థెరపీకి సుమారుగా 1.50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపారట.దీంతో ఎవరైనా దాతలు సహాయం చేయాలని వేడుకోగా ఆ పాప అనారోగ్య సమస్యలను తెలుసుకున్న బాలయ్య అభిమానులు 50వేల ఆర్థిక సహాయాన్ని అందించారట. అలాగే ఎవరైనా సహాయం చేయాలి అనుకుంటే.. వీటికి చేస్తే సరిపోతుంది అంటు ఒక ట్విట్టర్ ద్వారా తెలిపారు. దీంతో బాలయ్య అభిమానుల పై ప్రశంసలు కురిపిస్తున్నారు నేటిజన్స్..

మరింత సమాచారం తెలుసుకోండి: