సెల‌బ్రిటీలు ఏం చేసినా వైర‌ల్ అవుతూనే ఉంటాయి. ఇక సోష‌ల్ మీడియా వ‌చ్చాక సెల‌బ్రిటీలు ఏం చేసినా ట్రెండ్ అవుతున్నాయి. ఇక హీరోయిన్ల‌కు సంబంధించిన ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు, వారి హాట్ ఫోటోలు, చిన్న‌ప్ప‌టి ఫొటోలు కూడా అంతే వైర‌ల్ అవుతున్నాయి. వారు త‌మ త్రో బ్యాక్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో అలా షేర్ చేయ‌డం ఆల‌స్యం… అవి నిమిషాల్లోనే వైర‌ల్ అయిపోతున్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌కు సంబంధించిన చిన్న‌ప్ప‌టి ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది.మ‌రి ఈ హీరోయిన్ ఎవ‌రో ? ఆ స్టోరీ ఏంటో చూద్దాం. పై ఫొటోలో రేండు  జడలతో స్కూల్ డ్రస్ లో క్యూట్ గా ఉన్న బ్యూటీ ఎవరో కాదు టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే.ఈ ముద్దుగుమ్మ 2010లో మిస్ యూనివర్స్ పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచింది. సమయంలో పూజాను చూసి దర్శకుడు మిష్కిన్ తన 2012లో వచ్చిన ‘ముఖమూడి’ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. అలా పూజా తొలిసారిగా సినీ రంగానికి పరిచయమైంది. అదే సినిమా తెలుగులో మాస్క్ అనే పేరుతో రిలీజ్ అయ్యింది. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో పూజా తమిళ సినిమా నుంచి తప్పుకుంది.మెగా హీరో వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న ముకుంద సినిమాలో న‌టించింది పూజా హెగ్డే.ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రాణిస్తుంది పూజాహెగ్డే. కానీ ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఈ మధ్య కాలంలో పూజ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయి. దాంతో ఈ అమ్మడిని ఐరెన్ లెగ్ అని కూడా ట్రోల్ చేశారు. 

ఓవర్ నైట్ లో స్టార్ డమ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మలు చాలా మంది కొన్ని సినిమాలు చేసిన తర్వాత కనుమరుగైన సంగతి తెలిసిందే. కొంతమందికి స్టార్ డమ్ ఉన్నప్పటికీ సినిమాలు మాత్రం వరుసగా ఫ్లాప్ అవుతూ ఉంటాయి. అలాంటి వారిలో పూజాహెగ్డే ఒకరు.2014 తెలుగు సినిమా 'ఒక లైలా కోసం'లో అక్కినేనితో నాగ చైతన్య తో జతకట్టింది. ఆ తర్వాత హృతిక్ రోషన్ సరసన ‘మొహెంజ దారో’ అనే హిందీ చిత్రంలో నటించింది. మిగతా భాషల్లో పెద్దగా నటించకపోయినా తెలుగులో వరుసగా సినిమాలు చేసి మెప్పించింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ అలాగే అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో దాదాపు  స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది ఈ బ్యూటీ.మాస్క్ సినిమా తర్వాత తమిళ సినీ అభిమానుల్లో కనిపించకుండా పోయిన పూజ 2022లో విడుదలైన ‘బీస్ట్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. దళపతి విజయ్ సరసన నటించి తమిళ అభిమానుల దృష్టిని మరోసారి ఆకర్షించింది పూజా హెగ్డే.రణవీర్ సింగ్ సరసన సర్కస్, ప్రభాస్ సరసన రాధే శ్యామ్, అఖిల్ అక్కినేని సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, సల్మాన్ ఖాన్ సరసన కిజీ కా భాయ్ కిజీ కి జాన్ వంటి హిట్ చిత్రాలలో నటించిన పూజా రీసెంట్ గా చిన్న బ్రేక్ తీసుకొని ఇప్పుడు తిరిగి సినిమాల్లో బిజీ అయ్యింది. తాజాగా పూజా సూర్య  44తో కోలీవుడ్‌లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూర్య సరసన పూజా హెగ్డే నటిస్తోంది. తాజాగా పూజా తన షూటింగ్ పార్ట్ ను  పూర్తి చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: