నట‌సింహం నందమూరి బాలకృష్ణ నట వారసుడుగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పటికే ఖరారైన విషయం తెలిసిందే.. అదే సినిమాతో బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని కూడా నిర్మాతగా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇప్పటికే ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్ ను రెడీ చేస్తున్నాడు.  డిసెంబర్ నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభించడానికి రెడీ అవుతున్నాడు. ఇదే క్రమంలో మోక్షజ్ఞను ప్రశాంత్ రొమాంటిక్ హీరోగా టాలీవుడ్కు పరిచయం చేయబోతున్నాడని కూడా తెలుస్తుందే. అదే విధంగా ఈ మూవీలో బాలకృష్ణతోపాటు కళ్యాణ్ రామ్మ్ కూడా గెస్ట్ రోలు కనిపించనున్నారు.


ఇదే క్రమంలో ఇప్పుడు ఈ సినిమాలో మోక్షజ్ఞకు జంటగా నటించిబోయే హీరోయిన్ కు సంబంధించి అదిరిపోయే న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. ఇప్పటివరకు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన అన్ని సినిమాలలో కొత్త అమ్మాయిని హీరోయిన్గా తీసుకున్నారు. ఇప్పుడు మోక్షజ్ఞతో చేయబోయే సినిమాలో మాత్రం ఓ బాలీవుడ్ హీరోయిన్ తో పాటు టాలీవుడ్ స్టోరీ హీరోయిన్ శ్రీ లీలను కూడా తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్ప‌టికే మోక్ష‌జ్ఞ లుక్ ప‌రంగా మేకోవ‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే.


స్లిమ్ లుక్ లో చాక్లెట్ బోయ్ లా ఉన్నాడు. మోక్ష అమ్మాయిల గుండెల్లో రాకుమారుడు అయ్యేలా ఉన్నాడ‌నే ప్ర‌శంస‌లు అందుకున్నాడు. అయితే ఈ సినిమా క‌థ ఆధ్యాత్మిక‌త‌ను ఆధారంగా చేసుకుని ప్ర‌శాంత్ వ‌ర్మ రాసుకున్న‌ట్లు తెలుస్తోంది. పాన్ ఇండియాకి ఈసినిమా క‌నెక్ట్ అవ్వాలంటే? అలాంటి అంశం త‌ప్ప‌నిస‌రి అని ఇప్ప‌టికే రెండు సినిమాలు రుజువు చేసాయి. కార్తికేయ‌-2, హ‌నుమాన్ సినిమాలు పాన్ ఇండియా అలా స‌క్సెస్ అందుకున్న‌వే. బాల‌య్య అఖండ కూడా హిదుత్వం కాన్సెప్ట్ కావ‌డంతో టీవీ ద్వారా నార్త్ ఆడియ‌న్స్ బాగా రీచ్ అయింది. అందుకే ప్ర‌శాంత్ వ‌ర్మ ఆ లాజిక్ ని విడిచి పెట్ట‌డం లేదు. ఆపాయింట్ ని బేస్ చేసుకునే త‌న యూనివ‌ర్శ్ నుంచి రిలీజ్ అవుతున్న చిత్రంగా ప్ర‌క‌టించారు. ఈ చిత్రాన్ని దాదాపు 100 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: