మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ అందం విషయంలో ఇప్పుడు ఎన్నో మార్పులు వచ్చాయి. ఆమెపై ఏదో ఒక వార్త నిరంతరం సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతునే ఉంది. ఇప్పుడు ఉన్నట్టుండి ఆమె శరీరంలో ఎందుకని మార్పులు వచ్చాయి? ఆమె ఫేసులో మార్పులు ఏంటని ఇలా ఎన్నో ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. కానీ వాటికి సరైన సమాధానం మాత్రం ఎవరూ చెప్పట్లేదు. వయసుతో పాటు వచ్చిన మార్పులు గానే అంగీకరించాల్సి వస్తుంది.

అయితే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త‌ వైరల్ గా  మారింది.. అందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఐశ్వర్యరాయ్ అభిమానులకు మాత్రం ఇది గట్టి షాక్ ఇచ్చే న్యూస్ అనే చెప్పాలి. ఐశ్వర్య ఓ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నట్లు ఒక వార్త బయటకు వచ్చింది. అది కాస్త ఇప్పుడు అందర్నీ షాకు గురిచేస్తుంది. ఐశ్వర్యారాయ్ పై వస్తున్న ట్రోల్స్ నేపథ్యంలో ఓ యాప్ లో ఈ షాకింగ్ న్యూస్ వైరల్ గా మారింది. అందులో ఐశ్వర్య ఓ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతుందని.. ఆమె ఆరోగ్యానికి సంబంధించిన ఓ రిపోర్టును కూడా వైరల్ చేస్తున్నారు.

ఆ వ్యాధి కారణంగానే ఐశ్వర్యారాయ్ ముఖం అలా అయిందని.. అదే విధంగా గత కొంతకాలంగా ఆమె సరిగా తిండి కూడా తినటం లేదని, అయినా సరే బరువు పెరుగుతుందని మందులు వాడుతున్నప్పటికీ సరైన ఫలితం లేదని ప్రచారం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మరి కొంతమంది ఇది ఫేక్ న్యూస్ అని కొట్టు పడేస్తున్నారు.

నిన్న‌టి వ‌ర‌కూ ఐఫా వేడుక‌ల్లో క‌నిపించిన ఐశ్వ‌ర్యారాయ్ కి అనారోగ్యం ఏంటి? ఇవ‌న్నీ త‌ప్పుడు క‌థ‌నాల‌న్ని ఖండిస్తున్నారు. 1973 నవంబరు ఒకటోతేదీన జన్మించిన ఐశ్వర్యారయ్ కి ఇప్పుడు 50 సంవత్సరాలు. అలాంటి ఐశ్వ‌ర్యారాయ్ ని ఇప్ప‌టికీ 30 ఏళ్ల బ్యూటీలా చూడ‌టం అంటే ఎలా సాధ్య‌ప‌డుతుంది? చూప‌రుల ఆశ‌కు కూడా ఓహ‌ద్దు ఉండాలి అంటూ ఓ యూజ‌ర్ పోస్ట్ చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: